మార్చి 30, సోమవారం సంగారెడ్డి జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ పక్కన నూతన సబ్-డివిజినల్ పోలీసు కార్యాలయ భవనాన్ని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రజలకు మరింత సమర్థవంతమైన పోలీసు సేవలు అందించడమే లక్ష్యంగా ఈ నూతన కార్యాలయాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఆధునిక సదుపాయాలతో ఏర్పాటు చేసిన ఈ కార్యాలయం సిబ్బంది కార్యకలాపాలకు అనుకూలంగా ఉండటంతో పాటు ప్రజల సమస్యలకు వేగంగా పరిష్కారం లభించేలా ఉపయోగపడుతుందని అన్నారు. దీని ద్వారా ప్రజలకు పోలీసు సేవలు మరింత చేరువ అవుతాయని పేర్కొన్నారు.
పోలీసు శాఖలో సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తూ ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ప్రజలు ఎలాంటి సమస్యలు ఉన్నా నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సంగారెడ్డి డిఎస్పీ సత్యయ్య గౌడ్, డీసీఆర్బీ డిఎస్పీ సురేందర్ రెడ్డి, ఎఆర్ డిఎస్పీ నరేందర్, ఇన్స్పెక్టర్లు రమేష్, రాము నాయుడు, రామకృష్ణ రెడ్డి, కిరణ్ కుమార్, సదా నాగరాజు, ప్రవీణ్ రెడ్డి, నాగేశ్వర్ రావు, అనిల్, సబ్-డివిజినల్ పోలీసు అధికారులు, డిఎస్పీ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.



