Breaking News

నేర పరిశోధన, ప్రాసిక్యూషన్ నాణ్యత పెంపుదలే లక్ష్యం: ప్రాసిక్యూషన్ సమీక్షా కమిటీ సమావేశానికి అదనపు పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ అధ్యక్షత

హైదరాబాద్, జూలై 5: హైదరాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ (క్రైమ్స్ & సిట్) ఎం. శ్రీనివాస్ అధ్యక్షతన జూలై 4, 2026 సాయంత్రం వారి కార్యాలయంలో ప్రాసిక్యూషన్ సమీక్షా కమిటీ (Prosecution Review Committee) సమావేశం నిర్వహించారు. సమావేశంలో లీగల్ అడ్వైజర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, అలాగే హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని సంబంధిత పోలీస్ స్టేషన్ల ఎస్‌హెచ్‌ఓలు పాల్గొన్నారు.

సమావేశంలో 2026 జనవరి నుంచి మార్చి నెలల మధ్య కోర్టుల్లో నిందితులు విముక్తి పొందిన తీవ్రమైన నేరాల (Grave Acquittal) కేసులను సమగ్రంగా సమీక్షించారు. ఆయా కేసుల్లో నిందితులు నిర్దోషులుగా విడుదల కావడానికి దారితీసిన కారణాలతో పాటు, దర్యాప్తు మరియు ప్రాసిక్యూషన్ ప్రక్రియలో చోటుచేసుకున్న లోపాలు, లోటుపాట్లను కమిటీ క్షుణ్ణంగా పరిశీలించింది.

దర్యాప్తులో జరిగిన నిర్లక్ష్యం లేదా విధి నిర్వహణలో లోపాల కారణంగానే కేసులు కోర్టులో బలహీనపడ్డాయని నిర్ధారణకు వచ్చిన సందర్భాల్లో, సంబంధిత అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు మెమోలు జారీ చేయనున్నట్లు సమావేశంలో నిర్ణయించారు.

భవిష్యత్తులో ఇటువంటి లోపాలు పునరావృతం కాకుండా ఉండేందుకు దర్యాప్తు విధానాలను మరింత బలోపేతం చేయడం, ప్రాసిక్యూషన్ నాణ్యతను మెరుగుపరచడం, కోర్టుల్లో బలమైన సాక్ష్యాధారాలతో కేసులను సమర్థవంతంగా ప్రవేశపెట్టేందుకు అవసరమైన దిద్దుబాటు చర్యలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు.

వార్షిక తనిఖీల్లో భాగంగా సంగారెడ్డి జిల్లా పోలీస్ స్టేషన్లను సందర్శించిన డీఐజీ ఎల్.ఎస్. చౌహాన్

నేర పరిశోధనలో నాణ్యత, బాధ్యతాయుత దర్యాప్తు, సమర్థవంతమైన ప్రాసిక్యూషన్ ద్వారా న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ సమీక్షా సమావేశం ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు.

జారీ చేసిన వారు:
అదనపు పోలీస్ కమిషనర్ కార్యాలయం (క్రైమ్స్ & సిట్), హైదరాబాద్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *