4 బంగారు, 4 కాంస్య పతకాలతో సత్తా చాటిన క్రీడాకారులు – ఎస్పీ మహేష్ బి. గితే అభినందనలు
హైదరాబాద్: సైబరాబాద్ కమిషనరేట్ వేదికగా ఫిబ్రవరి 16 నుంచి 21 వరకు నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర 4వ పోలీస్ స్పోర్ట్స్ మీట్లో జిల్లా పోలీస్ క్రీడాకారులు విశేష ప్రతిభ కనబరిచారు. మొత్తం 08 పతకాలు (4 బంగారు, 4 కాంస్య) సాధించి జిల్లా ఖ్యాతిని నిలబెట్టారు.
ఈ విజయంపై జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో విజేతలకు పతకాలు అందజేసి అధికారులను, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.
ఎస్పీ మాట్లాడుతూ, క్రీడలు మానసిక దృఢత్వాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. గెలుపోటములు సహజమని, విజేతలు జాతీయ స్థాయిలో మెరుగైన ప్రదర్శన ఇవ్వడానికి కృషి చేయాలని సూచించారు. ఓటమి చెందిన వారు నిరాశ చెందకుండా తమ లోపాలను సరిదిద్దుకొని ముందుకు సాగాలని ప్రోత్సహించారు.
పతక విజేతలు ఇలా…
- లాన్ టెన్నిస్: జిల్లా ఆర్ముడ్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ మధుకర్ – కాంస్య పతకం
- బ్యాడ్మింటన్ మిక్స్డ్ డబుల్స్: డిసిఆర్బీ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు – కాంస్య పతకం
- టేబుల్ టెన్నిస్: ఏఆర్ఎస్ఐలు సత్యనారాయణ, ఆనంద్ – కాంస్య పతకాలు
- కాయకింగ్: ఆర్ముడ్ రిజర్వ్ కానిస్టేబుల్ సతీష్ – 500 మీటర్స్ సింగిల్, 500 మీటర్స్ డబుల్స్, 200 మీటర్స్ సింగిల్ విభాగాల్లో బంగారు పతకాలు
- కాయకింగ్: ఆర్ముడ్ రిజర్వ్ కానిస్టేబుల్ గంగరాజు – 500 మీటర్స్ సింగిల్, 500 మీటర్స్ డబుల్స్ విభాగాల్లో బంగారు పతకాలు
జిల్లా పోలీసుల ఈ విజయంతో విభాగంలో ఆనందం వ్యక్తమవుతోంది.
