బ్రేకింగ్ న్యూస్
నల్లగొండలో వరుస పగటి చోరీలకు చెక్.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్బంజారాహిల్స్‌ అత్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షగంజాయి వ్యసన నిర్మూలనే లక్ష్యం: బాధితులకు మెరుగైన వైద్యం అందించాలితెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి ఘనంగా నిర్వహించిన నల్గొండ జిల్లా పోలీసులుఆచార్య జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన సంగారెడ్డి అదనపు ఎస్పీసిరియల్ ఇళ్ల దొంగతనాల ముఠా అరెస్ట్.. రూ.12 లక్షల విలువైన బంగారం, వెండి స్వాధీనంప్రశాంతమైన జీవన విధానం అలవర్చుకోవాలి: మహబూబాబాద్ ఎస్పీ డా. శబరీష్విద్యార్థి దశ నుంచే సైబర్ మోసాలకు ఫుల్ స్టాప్.. సైబర్ సురక్షిత తెలంగాణ నిర్మిద్దాం: జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే“సురక్షా కా తిరంగా”తో సైబర్ మోసాలపై విస్తృత అవగాహన.. అప్రమత్తతే రక్షణ: నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష – రూ.10,000 జరిమానానల్లగొండలో వరుస పగటి చోరీలకు చెక్.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్బంజారాహిల్స్‌ అత్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షగంజాయి వ్యసన నిర్మూలనే లక్ష్యం: బాధితులకు మెరుగైన వైద్యం అందించాలితెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి ఘనంగా నిర్వహించిన నల్గొండ జిల్లా పోలీసులుఆచార్య జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన సంగారెడ్డి అదనపు ఎస్పీసిరియల్ ఇళ్ల దొంగతనాల ముఠా అరెస్ట్.. రూ.12 లక్షల విలువైన బంగారం, వెండి స్వాధీనంప్రశాంతమైన జీవన విధానం అలవర్చుకోవాలి: మహబూబాబాద్ ఎస్పీ డా. శబరీష్విద్యార్థి దశ నుంచే సైబర్ మోసాలకు ఫుల్ స్టాప్.. సైబర్ సురక్షిత తెలంగాణ నిర్మిద్దాం: జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే“సురక్షా కా తిరంగా”తో సైబర్ మోసాలపై విస్తృత అవగాహన.. అప్రమత్తతే రక్షణ: నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష – రూ.10,000 జరిమానా
Uncategorized

వార్షిక తనిఖీల్లో భాగంగా సంగారెడ్డి జిల్లా పోలీస్ స్టేషన్లను సందర్శించిన డీఐజీ ఎల్.ఎస్. చౌహాన్

వార్షిక తనిఖీల్లో భాగంగా సంగారెడ్డి జిల్లా పోలీస్ స్టేషన్లను సందర్శించిన డీఐజీ ఎల్.ఎస్. చౌహాన్

సంగారెడ్డి: వార్షిక తనిఖీలలో భాగంగా జోన్–VII జోగులాంబ డీఐజీ, ఇన్‌చార్జ్ జోన్–VI చార్మినార్ డీఐజీ ఎల్.ఎస్. చౌహాన్, ఐపీఎస్. సోమవారం సంగారెడ్డి మహిళా పోలీస్ స్టేషన్, సీసీఎస్, హత్నూర పోలీస్ స్టేషన్‌లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్.తో కలిసి స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు.

అనంతరం పోలీస్ స్టేషన్ల పరిశుభ్రత, సిబ్బంది బ్యారక్స్, రికార్డుల నిర్వహణ, కిట్ ఆర్టికల్స్‌ను పరిశీలించారు. ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలని, మిస్సింగ్ కేసులు మరియు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వేగవంతంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

తెలంగాణ పోలీస్ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చిన సీసీటీఎన్‌ఎస్–2.0, పిటిషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, టీఎస్-కాప్, హెచ్‌ఆర్‌ఎంఎస్ వంటి సాంకేతిక వేదికలపై పూర్తి అవగాహన పెంపొందించుకొని నేరాల నియంత్రణలో సమర్థవంతంగా వినియోగించాలని తెలిపారు.

ఫిర్యాదిదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి, వారి సమస్యలను ఓపికగా విని తగిన పరిష్కారం చూపుతామనే నమ్మకాన్ని కల్పించాలని ఎస్‌హెచ్‌ఓలకు సూచించారు. ప్రతి ఫిర్యాదును ఆన్‌లైన్‌లో నమోదు చేసి, సంబంధిత ఫైళ్లను నిర్ణీత గడువులోగా సీసీటీఎన్‌ఎస్‌లో అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు.

జిల్లా పరిశ్రమలకు కేంద్రంగా ఉండటంతో ఆర్థిక నేరాలు, ఆస్తి సంబంధిత నేరాలపై ప్రత్యేక నిఘా అవసరమని పేర్కొన్నారు. అధిక నేరాలు నమోదవుతున్న ప్రాంతాలను క్రైమ్ ప్రోన్ ఏరియాలుగా గుర్తించి పర్యవేక్షణ పెంచాలని సూచించారు. అలాగే సీసీ కెమెరాల ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహన కల్పించి, స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించాలని తెలిపారు.

సంగారెడ్డి జిల్లాలో ‘రౌడీ మేళా’.. సత్ప్రవర్తనతో ఉంటే హిస్టరీ షీట్లు క్లోజ్: అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి

రోడ్డు ప్రమాదాల నివారణ, సైబర్ నేరాల నియంత్రణ కోసం కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేయాలని సిబ్బందికి సూచించిన డీఐజీ, పోలీస్ స్టేషన్ల నిర్వహణ, రికార్డుల మెయింటెనెన్స్ సంతృప్తికరంగా ఉన్నాయని పేర్కొంటూ అధికారులు, సిబ్బందిని అభినందించారు.

ఈ తనిఖీలలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, సంగారెడ్డి డీఎస్పీ సత్యయ్య గౌడ్, పటాన్‌చెరు డీఎస్పీ ప్రభాకర్, సంబంధిత ఎస్‌హెచ్‌ఓలు, అధికారులు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.