• రాష్ట్ర స్థాయి పోలీస్ స్పోర్ట్స్ మీట్లో సత్తా చాటాలి.. సిబ్బందికి ట్రాక్ సూట్స్, టీ-షర్ట్స్ అందజేత..
• క్రీడా స్పూర్తిని ప్రదర్శించి, విజయంతో తిరిగిరావాలని క్రీడాకారులకు బెస్ట్ విషెస్ తెలిపిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్.

సంగారెడ్డి జిల్లా: తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ మీట్ పోటీల్లో సంగారెడ్డి జిల్లా పోలీసులు ప్రతిభ కనబరిచి సత్తా చాటాలని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఆకాంక్షించారు. రేపటి నుండి సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో (తేది: 16-21 ఫిబ్రవరి వరకు) జరగనున్న తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ మీట్ పోటీలలో పాల్గొనే క్రీడాకారులకు ట్రాక్ సూట్స్, టీ-షర్ట్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, క్రీడాకారులు క్రీడా స్పూర్తిని ప్రదర్శిస్తూ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరచాలని, సంగారెడ్డి జిల్లా పోలీసు శాఖ విజయ పతాకం ఎగురవేయాలని అన్నారు. పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణలోనే కాకుండా క్రీడల్లో కూడా రాణించగలరని నిరూపించాలని సూచించారు. క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందికి శాఖాపరమైన గుర్తింపు మరియు ప్రోత్సాహం అందిస్తామని ఎస్పీ తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రఘునందన్ రావు, ఆర్.ఐ రాజశేఖర్ రెడ్డి, ఆర్.ఎస్.ఐ అశోక్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.
