Breaking News

జాతర రద్దీలో తప్పిపోయిన వారికి పోలీసుల సహాయం — కుటుంబాలకు సురక్షితంగా చేరవేత.

రాజన్న సిరిసిల్ల జిల్లా.

జాతర రద్దీలో తప్పిపోయిన వారికి పోలీసుల సహాయం — కుటుంబాలకు సురక్షితంగా చేరవేత.

జాతరలో తప్పిపోయిన పిల్లలు, వృద్ధులను గుర్తించి వారి కుటుంబ సభ్యులకు సురక్షితంగా అప్పగిస్తు సేవాభావానికి నిదర్శనంగా నిలుస్తున్న పోలీస్ యంత్రాంగం…

జాతర సందర్భంగా భారీగా తరలివచ్చిన భక్తుల రద్దీ మధ్య తప్పిపోయిన పిల్లలు, వృద్ధులను పోలీసులు అప్రమత్తంగా గుర్తించి, వారికి తగిన సంరక్షణ కల్పిస్తూ వారి కుటుంబ సభ్యులకు సురక్షితంగా అప్పగిస్తున్నారు.

సైఫాబాద్ పోలీసుల భారీ విజయం: 21.251 కిలోల గంజాయి స్వాధీనం.. ఇద్దరు మహిళల అరెస్ట్

జాతర ప్రాంగణంలో ప్రత్యేక సహాయక కేంద్రాలు ఏర్పాటు చేసి, తప్పిపోయిన వారి వివరాలను నమోదు చేసి, ప్రకటనల ద్వారా కుటుంబ సభ్యులను గుర్తిస్తున్నారు. పిల్లలు, వృద్ధులు భయాందోళనకు గురి కాకుండా పోలీస్ సిబ్బంది వారితో సానుభూతిగా మాట్లాడి ధైర్యం చెబుతున్నారు.

భక్తులు తమ పిల్లలు, వృద్ధులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లోనైనా వెంటనే సమీప పోలీస్ సిబ్బందిని సంప్రదించాలని అధికారులు సూచించారు.

జాతరలో భక్తుల భద్రతే లక్ష్యంగా పోలీసులు నిరంతరం సేవలు అందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *