సంగారెడ్డి జిల్లాకు నూతన అదనపు ఎస్పీ (అడ్మిన్)గా చైతన్య రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. 22-04-2026న అధికారికంగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఆమె, అనంతరం జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.
చైతన్య రెడ్డి 2022 బ్యాచ్కు చెందిన అధికారి. ఇంతకుముందు కామారెడ్డి జిల్లాలో అదనపు ఎస్పీ (అడ్మిన్)గా సేవలందించారు. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాకు బదిలీపై వచ్చి బాధ్యతలు చేపట్టారు.
జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తానని, ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా తెలిపారు.
