
ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా వెంటనే స్పందించి సహాయం చేయడం పోలీస్ శాఖ బాధ్యత అని మరోసారి నిరూపించారు. పోలీస్ స్టేషన్కు వెళ్లలేని స్థితిలో ఉన్న బాధితుడి వద్దకే వెళ్లి FIR నమోదు చేసిన ఘటన బయ్యారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మధ్యాహ్నం సుమారు 1:45 గంటల సమయంలో, బయ్యారం గ్రామానికి చెందిన రాయల సతీష్ అనే వ్యక్తి గాయపడిన కారణంగా పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాడు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే బయ్యారం ఎస్.ఐ. తిరుపతి సంఘటన స్థలానికి స్వయంగా వెళ్లి బాధితుడిని పరామర్శించి, అతని నుండి ఫిర్యాదును స్వీకరించారు. బాధితుడి పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, న్యాయం ఆలస్యం కాకూడదనే ఉద్దేశంతో సంఘటన స్థలంలోనే ఆన్ -సైట్ ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసి ఈ కేసును BNS చట్టంలోని నమోదు చేశారు. పోలీస్ స్టేషన్కు వెళ్లలేని పరిస్థితిలో ఉన్నా కూడా ప్రజలు నిరాశ చెందాల్సిన అవసరం లేదని, పోలీసులు ప్రజల భద్రత కోసం మహబూబాబాద్ జిల్లా పోలీసులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని ఈ ఘటన స్పష్టంగా తెలియజేస్తోంది. అవసరమైన సందర్భాల్లో పోలీసులు స్వయంగా ప్రజల వద్దకే వెళ్లి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటారు. ఈ సంఘటన పోలీసులు ప్రజలకు ఎంత దగ్గరగా ఉన్నారో, ప్రజల సమస్యలను ఎంత బాధ్యతగా తీసుకుంటారో చూపించే మంచి ఉదాహరణగా నిలిచింది.
