హైదరాబాద్, మార్చి 3: తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి Revanth Reddy కీలక సమావేశం నిర్వహించారు.
99 రోజుల “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రజలకు ప్రభుత్వ పథకాల అమలు వేగవంతం చేయడం, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడం లక్ష్యంగా ఈ ప్రణాళికను రూపొందించినట్లు సమాచారం.
కార్యక్రమం విజయవంతంగా అమలు కావడానికి అధికారులు, జిల్లా కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. సమావేశంలో పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
