Breaking News

వాలెంటైన్స్ డే సందర్భంగా సైబర్ మోసాలపై హెచ్చరిక.

వాలెంటైన్స్ డే జరుపుకుంటున్న సమయంలో, ఆన్‌లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా పోలీసులు సూచిస్తున్నారు. ఈ వాలెంటైన్స్ డే ను లక్ష్యంగా చేసుకుని, సైబర్ నేరగాళ్లు వివిధ రకాల మోసాలకు పాల్పడే అవకాశముందని అన్నారు.
సాధారణంగా కనిపించే మోసాలు: నకిలీ గిఫ్ట్ వౌచర్లు మరియు ఆఫర్లు డేటింగ్ యాప్‌ల ద్వారా పరిచయం చేసుకుని డబ్బులు అడగడం (రొమాన్స్ స్కామ్‌లు) నకిలీ సోషల్ మీడియా ప్రొఫైల్‌లు ఆన్‌లైన్ చెల్లింపుల పేరుతో ఫిషింగ్ లింకులు పంపడం.
జాగ్రత్తలు: తెలియని లింకులపై క్లిక్ చేయకండి. సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తులపై పూర్తిగా నమ్మకం ఉంచే ముందు ధృవీకరించండి. OTPలు, బ్యాంక్ ఖాతా వివరాలు, కార్డు నంబర్లు ఎవరితోనూ పంచుకోకండి. అనుమానాస్పద లావాదేవీలు గమనిస్తే వెంటనే మీ బ్యాంక్‌ను సంప్రదించండి. సైబర్ మోసాలకు గురైనట్లయితే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు కాల్ చేయండి లేదా www.cybercrime.gov.in లో ఫిర్యాదు నమోదు చేయండి. “క్లిక్ చేసే ముందు ఆలోచించండి – నమ్మే ముందు ధృవీకరించండి.” ప్రజల భద్రతే మా ప్రథమ కర్తవ్యం.

పెరుగాంచిన్ చైన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్.. రూ.5 లక్షల విలువైన బంగారు నగల స్వాధీనం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *