Breaking News

రికవరీ చేసిన 32 మొబైల్ ఫోన్ల అందజేత-చంద్రయాణగుట్ట పోలీసులు.

చంద్రయాణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో పోగొట్టుకున్న 32 మొబైల్ ఫోన్లను క్రైమ్ టీం విజయవంతంగా రికవరీ చేసింది. పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ ఫోన్లను బాధితులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో చంద్రయాణగుట్ట ఏసీపీ ఏ. సుధాకర్ పాల్గొని వివరాలను వెల్లడించారు.
• చంద్రయాణగుట్ట SHO మరియు డీఐ పర్యవేక్షణలో క్రైమ్ టీం సభ్యులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి 2026 సంవత్సరంలో ఇప్పటివరకు 32 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
• మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న వారు వెంటనే అధైర్యపడకుండా CEIR పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని ఏసీపీ సూచించారు. ఈ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయడం వల్లే ఫోన్లను త్వరగా గుర్తించడం సాధ్యమైందని ఆయన తెలిపారు.
• పోగొట్టుకున్న ఫోన్ల ద్వారా జరిగే ఆన్‌లైన్ మోసాలు మరియు అనధికారిక లావాదేవీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
• ఫోన్ల రికవరీ కోసం ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు ఏసీపీ వివరించారు.
తమ ఫోన్లను తిరిగి పొందిన బాధితులు చంద్రయాణగుట్ట పోలీసులకు మరియు క్రైమ్ టీంకు కృతజ్ఞతలు తెలియజేశారు.

పెరుగాంచిన్ చైన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్.. రూ.5 లక్షల విలువైన బంగారు నగల స్వాధీనం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *