
రాష్ట్రములో ఏవైనా పర్యావరణ విపత్తులు సంభవించినప్పుడు ప్రజలను రక్షించడానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రములోని ప్రతి బెటాలియన్ లో 100 మంది సిబ్బందితో స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ పోర్స్ (SDRF) విభాగం వుండాలనే ఉద్దేశముతో ప్రతి బెటాలియన్ లో స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ పొర్స్ విభాగమును ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశల మేరకు తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలిస్ (TGSP) అడిషనల్ డీజీపి ఆధ్వర్యంలో 17వ పోలిస్ బెటాలియన్ కమాండెంట్ టి.గంగారాం 17వ బెటాలియన్ లో SDRF సెలక్షన్స్ నిర్వహించడం జరిగింది. సెలక్షన్స్ లో బాగంగా అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు మరియు స్విమ్మింగ్ పరీక్షలను నిర్వహించారు. ఈ సంద్భంగా బెటాలియన్ కమాండెంట్ టి . గంగారాం మాట్లాడుతూ రాష్ట్రములో ఏవైనా పర్యావరణ విపత్తులు సంభవించినప్పుడు ప్రజలను రక్షించడానికి ఏర్పాటు చేసిందే తెలంగాణలోని రాష్ట్ర ప్రత్యేక విపత్తు నిర్వహణ బృందం (SDRF). ప్రజలను రక్షించడమే పోలీసుల మొదటి కర్తవ్యమని రాష్ట్రములో ఎటువంటి విపత్తులు సంభవించిన ఆ విపత్తుల నుండి ప్రజలను రక్షించడానికి SDRF సిబ్బంది ఎల్లప్పుడూ సిద్ధముగా వుంటారని తెలియజేశారు.
ఈ సెలక్షన్స్ కార్యక్రమంలో ఆర్ . ఐ. బి . శ్రీనివాస్, ఎ.రమేష్ మరియు R.S.I లు పాల్గొన్నారు.
