Breaking News

మాదకద్రవ్యాలకు నో… లక్ష్యాలకు యెస్: విద్యార్థులతో కలిసి గంజాయి వ్యతిరేక ప్రతిజ్ఞ చేసిన జిల్లా ఎస్పీ డా. శబరీష్

మహబూబాబాద్, జూన్ 24: యువత భవిష్యత్తును కాపాడాలంటే మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి జీవిత లక్ష్యాలపై దృష్టి సారించాలని జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ సూచించారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పోలీస్ స్టేషన్ పరిధిలోని జడ్పీ హైస్కూల్‌లో నిర్వహించిన “మన ఊరు – మన బాధ్యత” కార్యక్రమంలో ఆయన పాల్గొని విద్యార్థులకు గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో 9వ, 10వ తరగతి విద్యార్థులతో పాటు ఇంటర్మీడియట్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన ఎస్పీ, గంజాయి వంటి మాదకద్రవ్యాలు యువత జీవితాలను, వారి విద్యా భవిష్యత్తును తీవ్రంగా దెబ్బతీస్తాయని అన్నారు. ఒకసారి వాటికి బానిసైతే చదువు, ఆరోగ్యం, కుటుంబ జీవితం ప్రభావితమవుతాయని హెచ్చరించారు.

విద్యార్థి దశలోనే స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించిన ఆయన, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు గర్వపడేలా మంచి పేరు సంపాదించాలని కోరారు. చెడు స్నేహాలు, చెడు అలవాట్లు మరియు మాదకద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. “నేటి విద్యార్థులే రేపటి దేశ భవిష్యత్తు” అని పేర్కొంటూ, ప్రతి ఒక్కరూ తమ జీవిత లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని సూచించారు.

“Say No To Drugs – Say Yes To Life” అనే సందేశాన్ని ప్రతి విద్యార్థి తమ జీవితంలో ఆచరణలో పెట్టాలని ఎస్పీ కోరారు. అనంతరం గంజాయి వ్యతిరేక సందేశాలతో రూపొందించిన “Say No To Drugs” పోస్టర్లను ఆవిష్కరించి విద్యార్థులతో కలిసి ప్రదర్శించారు. మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలను సమాజానికి తెలియజేయడంలో యువత ముందుండాలని సూచించారు.

హైదరాబాద్ మెట్రో ఫేజ్-1 స్వాధీనం, ఫేజ్-2 విస్తరణకు మార్గం సుగమం

కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన “Wall of Promise” వద్ద విద్యార్థులందరితో కలిసి ఎస్పీ గంజాయి వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు. గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని, తమ తోటి విద్యార్థులను కూడా చెడు అలవాట్ల బారిన పడకుండా చైతన్యవంతులను చేస్తామని ప్రతిజ్ఞ చేసిన విద్యార్థులు వాల్ ఆఫ్ ప్రామిస్‌పై సంతకాలు చేశారు. వందలాది మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని గంజాయి రహిత సమాజ నిర్మాణానికి తమ మద్దతు ప్రకటించారు.

యువతలో అవగాహన పెంపొందించడం ద్వారానే మాదకద్రవ్యాల నిర్మూలన సాధ్యమవుతుందని పేర్కొన్న ఎస్పీ, గంజాయి నిర్మూలన కోసం రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖ మరియు EAGLE ఫోర్స్ చేపడుతున్న కార్యక్రమాలకు విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సహకరించాలని కోరారు.

గంజాయి సాగు, రవాణా, విక్రయాలు లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం అందించిన వారికి రూ.5,000 వరకు నగదు బహుమతి అందజేస్తామని తెలిపారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని పేర్కొంటూ, గంజాయికి సంబంధించిన ఎలాంటి సమాచారం ఉన్నా 87126 56999 నంబర్‌కు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *