Breaking News

చింతల్ బస్తీలో సైఫాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో డ్రగ్స్ నియంత్రణ అవగాహన ర్యాలీ

హైదరాబాద్: మాదకద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా సైఫాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో చింతల్ బస్తీ ప్రాంతంలో శుక్రవారం భారీ డ్రగ్స్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. సైఫాబాద్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) ఎ. సీతయ్య నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సబ్-ఇన్‌స్పెక్టర్లు, పోలీసు సిబ్బంది, నిర్మల హైస్కూల్ ప్రిన్సిపాల్ శ్రీమతి లక్ష్మి, ఉపాధ్యాయులు, సుమారు 150 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

సమాజంలో పెరుగుతున్న మాదకద్రవ్యాల వినియోగంపై ప్రజల్లో, ముఖ్యంగా యువతలో అవగాహన కల్పించడం ఈ ర్యాలీ ప్రధాన ఉద్దేశంగా నిర్వాహకులు తెలిపారు. విద్యార్థులు, పోలీసులు కలిసి చింతల్ బస్తీ వీధుల్లో పర్యటిస్తూ డ్రగ్స్ వ్యతిరేక నినాదాలతో ప్రజలను చైతన్యపరిచారు.

ర్యాలీలో “డ్రగ్స్‌కు నో చెప్పండి – జీవితానికి యస్ చెప్పండి”, “డ్రగ్స్ లేని యువత – బలమైన దేశం”, “ఆరోగ్యాన్ని ఎంచుకోండి – డ్రగ్స్‌ను కాదు”, “తెలివిగా ఉండండి – డ్రగ్స్ జోలికి వెళ్లకండి”, “డ్రగ్స్‌ను అరికట్టండి – భవిష్యత్తును రక్షించండి” వంటి నినాదాలు చేశారు.

ధర్మపూర్‌లో మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక తనిఖీలు.. రుద్ర జాగిలంతో హోటళ్లు, షాపుల పరిశీలన

ఈ సందర్భంగా ఎస్‌హెచ్‌ఓ ఎ. సీతయ్య మాట్లాడుతూ, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో యువత, విద్యాసంస్థల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. మాదకద్రవ్యాల విక్రయం లేదా వినియోగానికి సంబంధించిన ఎలాంటి సమాచారం తెలిసినా వెంటనే పోలీసులకు తెలియజేసి సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఈ అవగాహన ర్యాలీ ద్వారా విద్యార్థులు, స్థానిక ప్రజల్లో డ్రగ్స్ దుష్ప్రభావాలపై చైతన్యం పెంపొందించడంతో పాటు సమాజాన్ని మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడే సందేశాన్ని పోలీసులు అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *