Breaking News

చందుర్తి, రుద్రంగి పోలీస్ స్టేషన్లు సందర్శించిన జిల్లా ఎస్పీ మహేష్ బి గితే ఐపీఎస్.

ప్రజలకు అందుబాటులోకి ఉంటూ సమర్థవంతమైన సేవలు అందించాలి. సర్కిల్ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో విజిబుల్ పోలీసింగ్ పై దృష్టిసారించాలి. చందుర్తి సర్కిల్ కార్యాలయం,చందుర్తి, రుద్రంగి పోలీస్ స్టేషన్లు సందర్శించిన జిల్లా ఎస్పీ మహేష్ బి గితే ఐపీఎస్.,చందుర్తి సర్కిల్ కార్యాలయం, చందుర్తి , రుద్రంగి పోలీస్ స్టేషన్లతో పాటుగా రుద్రంగి మానాల చెక్ పోస్ట్ ,లింగంపేట గ్రామశివారులో ఉన్న పోలీస్ అమరవీరుల స్తూపం సందర్శించిన అనంతరం పోలీస్ స్టేషన్ల పరిసరాలు, సిబ్బంది పని తీరు,సర్కిల్ పరిధిలో నమోదు అవుతున్న కేసుల వివరాలు, పెండింగ్ కేసుల వివరాలు అడిగి తెలుసుకుని త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ సంవర్దవంతమైన సేవలు అందజేస్తు సత్వర న్యాయం జరిగేలా కృషి చేయాలన్నారు. విజిబుల్ పోలీసింగ్లో భాగంగా అధికారులు,విలేజ్ పోలీస్ అధికారులు తరచు గ్రామాలు పర్యటిస్తూ ప్రజలతో మమేకం అవుతు ప్రజలకు సైబర్ నేరాలు,ట్రాఫిక్ నియమాలు,అక్రమ బెట్టింగ్ ,గేమింగ్ యాప్స్ కలుగు అనర్ధాలపైమరియు తదితర అంశాల మీద అవగాహన కల్పించాలని, గ్రామ స్థాయిలో ఇన్ఫర్మేషన్ వ్యవస్థ పటిష్టం చేసుకోని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. స్టేషన్ల పరిధిలో ప్రమాదాల నివారణకు ప్రతీ రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, వాహనల తనిఖీలు నిర్వహించాలని అన్నారు. పాత నేరస్థుల కదలికలపై నిఘా పెడుతూ పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎస్పీ వెంట సి.ఐ వెంకటేశ్వర్లు, ఎస్.ఐ లు అశోక్, అంజయ్య, పోలీస్ స్టేషన్ సిబ్బంది ఉన్నారు.

2025 సంవత్సరానికి గాను మొదటి ఆరు నెలల (జనవరి నుండి జూన్ వరకు) మెగా రివార్డ్స్ – సీపీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *