బ్రేకింగ్ న్యూస్
రాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్ ధరించండి: సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్శాంతి, సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనంవికారాబాద్ జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బి. రమేశ్ కుమార్పోగొట్టుకున్న 34 మొబైల్ ఫోన్లు రికవరీ.. బాధితులకు అందజేసిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులుఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు.సెల్‌ఫోన్ చోరీతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ.. కొత్త ‘హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్’పై హైదరాబాద్ సీపీ హెచ్చరికప్రజా విశ్వాసమే సమర్థవంతమైన పోలీసింగ్‌కు పునాది: ఎస్పీ డా. శబరీష్ఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీలను శాంతియుతంగా నిర్వహించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంపై జాయింట్ సీపీ డి. జోయల్ డేవిస్ క్షేత్రస్థాయి పరిశీలనడ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం.. గూడూరులో 1,000 మందికి పైగా విద్యార్థులతో 2K రన్రాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్ ధరించండి: సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్శాంతి, సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనంవికారాబాద్ జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బి. రమేశ్ కుమార్పోగొట్టుకున్న 34 మొబైల్ ఫోన్లు రికవరీ.. బాధితులకు అందజేసిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులుఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు.సెల్‌ఫోన్ చోరీతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ.. కొత్త ‘హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్’పై హైదరాబాద్ సీపీ హెచ్చరికప్రజా విశ్వాసమే సమర్థవంతమైన పోలీసింగ్‌కు పునాది: ఎస్పీ డా. శబరీష్ఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీలను శాంతియుతంగా నిర్వహించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంపై జాయింట్ సీపీ డి. జోయల్ డేవిస్ క్షేత్రస్థాయి పరిశీలనడ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం.. గూడూరులో 1,000 మందికి పైగా విద్యార్థులతో 2K రన్
SANGA REDDY DIST

పోలీసు కుటుంబాల పిల్లల కోసం “స్పార్క్” కార్యక్రమం.. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సన్మానం

పోలీసు కుటుంబాల పిల్లల కోసం “స్పార్క్” కార్యక్రమం.. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సన్మానం

సంగారెడ్డి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీసు కుటుంబాలకు చెందిన విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహిస్తూ “స్పార్క్” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందిస్తూ సంగారెడ్డి జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో ఈ కార్యక్రమం జరిగింది. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, రివార్డులు అందజేశారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ.. పోలీసు కుటుంబాలకు చెందిన పిల్లల విద్యా ప్రగతిని ప్రోత్సహించేందుకు “స్పార్క్” (Supporting Potential Academic Rise for Khaki Kids) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. చిన్న వయస్సులోనే పిల్లల ప్రతిభను సరైన దిశలో ప్రోత్సహిస్తే వారు జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని అన్నారు.

పదవ తరగతి, ఇంటర్ విద్యార్థుల జీవితంలో కీలకమైన దశలని, ఈ సమయంలో కష్టపడి చదివితే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని పేర్కొన్నారు. సెల్‌ఫోన్ వినియోగంపై తల్లిదండ్రులు పర్యవేక్షణ అవసరమని, పిల్లలను సమతుల్య విధానంలో పెంచాలని సూచించారు.

అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రమశిక్షణ, సేవాభావం, నాయకత్వ లక్షణాల్లో కూడా ముందుండాలని సూచించారు. నిరంతర కృషి, సమయపాలన, ఆత్మవిశ్వాసంతో ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చని అన్నారు. పోలీసు ఉద్యోగుల సేవల వల్లే ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారని, ఆ త్యాగాలను పిల్లలు గుర్తించాలని పేర్కొన్నారు.

సంగారెడ్డి జిల్లాలో ఒకే రాత్రి రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతి

ఈ కార్యక్రమంలో డిటిసి అదనపు ఎస్పీ శ్రీనివాస్ రావు, అడ్మినిస్ట్రేటివ్ అధికారి పద్మావతి, డీఎస్పీలు సత్యయ్య గౌడ్, వెంకట్ రెడ్డి, ప్రభాకర్, సైదా నాయక్, ఆర్‌డీఎస్పీ నరేందర్, జిల్లా ఇన్‌స్పెక్టర్లు, ఆర్‌ఐలు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.