బ్రేకింగ్ న్యూస్
డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం.. గూడూరులో 1,000 మందికి పైగా విద్యార్థులతో 2K రన్హైదరాబాద్‌లో 38 కిలోల ఎండు గంజాయి స్వాధీనం.. ఐదుగురు అరెస్ట్నకిలీ నంబర్ ప్లేట్లపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఉక్కుపాదంనాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ హత్య కేసులో సంచలన విషయాలు.. ఇద్దరు టెన్త్ క్లాస్ విద్యార్థుల అరెస్ట్‘బాబు’ అనే ఒక్క మాటతో వీడిన ప్రిన్సిపల్ హత్య మిస్టరీకేసుల సత్వర పరిష్కారం, నేరస్తులకు శిక్షలు పడేలా చేయడంలో సీడీఓల పాత్ర కీలకం: జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్హై-పవర్డ్ కమిటీ చర్లపల్లి ప్రిజనర్స్ అగ్రికల్చరల్ కాలనీ సందర్శనప్రజావాణిలో ప్రజల ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా ఎస్పీ డి. జానకి, ఐపీఎస్నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి: పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలిప్రతి పిటిషన్‌ను నిర్ణీత సమయంలో పరిశీలించి పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ డా. శబరీష్డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం.. గూడూరులో 1,000 మందికి పైగా విద్యార్థులతో 2K రన్హైదరాబాద్‌లో 38 కిలోల ఎండు గంజాయి స్వాధీనం.. ఐదుగురు అరెస్ట్నకిలీ నంబర్ ప్లేట్లపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఉక్కుపాదంనాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ హత్య కేసులో సంచలన విషయాలు.. ఇద్దరు టెన్త్ క్లాస్ విద్యార్థుల అరెస్ట్‘బాబు’ అనే ఒక్క మాటతో వీడిన ప్రిన్సిపల్ హత్య మిస్టరీకేసుల సత్వర పరిష్కారం, నేరస్తులకు శిక్షలు పడేలా చేయడంలో సీడీఓల పాత్ర కీలకం: జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్హై-పవర్డ్ కమిటీ చర్లపల్లి ప్రిజనర్స్ అగ్రికల్చరల్ కాలనీ సందర్శనప్రజావాణిలో ప్రజల ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా ఎస్పీ డి. జానకి, ఐపీఎస్నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి: పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలిప్రతి పిటిషన్‌ను నిర్ణీత సమయంలో పరిశీలించి పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ డా. శబరీష్
SANGA REDDY DIST

సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ పరితోష్ పంకజ్

సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ పరితోష్ పంకజ్

సంగారెడ్డి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపీఎస్ బుధవారం సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్‌తో పాటు సర్కిల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్, కార్యాలయ ఆవరణ పరిశుభ్రతను పరిశీలించి, వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాలను క్రమబద్ధంగా ఉంచాలని సూచించారు.

స్టేషన్ రికార్డులు అయిన జనరల్ డైరీ, హిస్టరీ షీట్లు, పిటిషన్ రిజిస్టర్‌లను పరిశీలించిన ఎస్పీ, అన్ని రికార్డులు తాజా సమాచారంతో అప్డేట్‌గా ఉండాలని ఆదేశించారు. పెండింగ్ మరియు దర్యాప్తులో ఉన్న కేసులపై సమగ్ర వివరాలు తెలుసుకుని, ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం అందించాలని సూచించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఎస్‌హెచ్‌ఓకు ఆదేశించారు.

రోడ్డు ప్రమాదాల నివారణ కోసం “అరైవ్ అలైవ్” వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రమాదాలకు గురయ్యే ప్రాంతాలను గుర్తించి, ఎన్‌హెచ్‌ఏఐతో సమన్వయం చేసుకుని రోడ్ల మరమ్మతులు చేపట్టాలని సూచించారు. తరచూ వాహనాల తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్, నాకాబంది వంటి ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించి అనుమానిత వ్యక్తులు, వాహనాలపై నిఘా ఉంచాలని ఆదేశించారు.

సంగారెడ్డి జిల్లాలో ఒకే రాత్రి రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతి

స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లు, కేడీలు, అనుమానితులపై ప్రత్యేక నిఘా ఉంచాలని, సైబర్ నేరాలు మరియు రోడ్డు ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

తదుపరి సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేయాలని, స్టేషన్‌కు వచ్చే ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని చెప్పారు. సిబ్బంది సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని, ఏవైనా వ్యక్తిగత సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఉత్తమ పనితీరు కనబరిచిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు.