
సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో ఎస్.హెచ్.ఓ (SHO) ఏరుకొండ సీతయ్య ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న మహిళా అధికారులను మరియు సిబ్బందిని ఎస్.హెచ్.ఓ సీతయ్య మరియు డి.ఐ (DI) రాజేందర్ శాలువాలతో ఘనంగా సన్మానించి, వారి సేవలను అభినందించారు. సన్మానం పొందిన వారిలో డబ్ల్యూ.ఎస్.ఐ (WSI) పరమేశ్వరి, డబ్ల్యూ.ఎస్.ఐ ప్రసన్న (లేక్ పి.ఎస్), మరియు సిబ్బంది వి. దుర్గా భవాని, వి. దుర్గ, టి. మమత, పద్మావతి, ఎ. శ్రీలక్ష్మి, కె. వాణి, కె. లత ఉన్నారు. ఈ సందర్భంగా ఎస్.హెచ్.ఓ ఎ.సీతయ్య మాట్లాడుతూ.పోలీస్ వ్యవస్థలో మహిళా సిబ్బంది కృషి వెలకట్టలేనిదని కొనియాడారు. వృత్తిపరమైన బాధ్యతలతో పాటు కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, సమాజ రక్షణలో మహిళా పోలీసులు చూపుతున్న నిబద్ధత గర్వకారణమని ఆయన ప్రశంసించారు. మహిళా సాధికారతతోనే సమాజం అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్లు బాలరాజు, నవీన్, సౌమ్య, శంకర్ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

