Breaking News

ట్రాఫిక్ నిబంధనలపై విద్యార్థిని విద్యార్థులకు ప్రతిజ్ఞ చేయించిన జిల్లా ఎస్పీ.

•ట్రాఫిక్ రూల్స్ పాటించి, రోడ్డు ప్రమాదాల నుండి రక్షణ పొందండి.
•ట్రాఫిక్ నిబంధనలపై విద్యార్థిని విద్యార్థులకు ప్రతిజ్ఞ చేయించిన జిల్లా ఎస్పీ.
•రోడ్డు భద్రత వారోత్సవాలలో భాగంగా ట్రాఫిక్ రూల్స్ పై జహీరాబాద్ పట్టణలోని వివిధ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థి, విద్యార్థులకు అవగాహన కల్పించిన జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ ఐపియస్.
జహీరాబాద్ సబ్-డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో ఎన్-కన్వెన్షన్ హాల్, జహీరాబాద్ పట్టణం నందు ఏర్పాటు చేసిన రోడ్డు సేఫ్టీ అవగాహన కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థి, విద్యార్థులను ఉద్దేశించి జిల్లా ఎస్పీ మాట్లాడుతూ. ట్రాఫిక్ రూల్స్ గురించి ప్రతి ఒక్కరు అవగాహన కలిగి, విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని అన్నారు. 18 సంవత్సరాలు నిండినవారు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలని సూచించారు. మైనర్లు వాహనాలు నడపరాదని, మైనర్లు వాహనాల నడిపితే వారి తల్లిదండ్రులపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని అన్నారు. చిన్న, చిన్న నిర్లక్ష్యాల కారణంగా ప్రతి ఏటా ఎన్నో కుటుంబాలు రోడ్డు ప్రమాదాల బారినపడి రోడ్డున పడుతున్నాయని, ఒక కుటుంబ యజమాని కోల్పోతే ఆ కుటుంబ పోషణ బారమై అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కోవడం జరుగుతుందన్నారు. యువత విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించి, మోటర్ సైకిల్ నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని, కారు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ ధరించాలని అన్నారు. వాహనాన్ని మితిమీరిన వేగంలో నడపరాదని, స్పీడ్ త్రిల్లింగా ఉండొచ్చుకాని, మితిమీరిన వేగం ప్రాణాల మీదికి వస్తుందని గుర్తించాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, మద్యం మత్తులో ఏకాగ్రత కోల్పోయి రోడ్డు ప్రమాదాలు జరగటానికి అవకాశం ఉంటుందని అన్నారు. వాహనాలు నడుపుతూ సెల్ ఫోన్ మాట్లాడరాదని అన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి ట్రాఫిక్ నిబంధనలు తెలుసుకొని ఉండి, మీ తల్లిదండ్రులకు అవగాహన కలిగించాలని అన్నారు. నూతన ట్రాఫిక్ చట్టాల ప్రకారం మద్యం సేవించి పట్టుబడితే జైలుకు పంపించడం జరుగుతుందన్నారు.
అనంతరం మాదకద్రవ్యాలు దుర్వినియోగం గురించి మాట్లాడుతూ.మాదక ద్రవ్యాల వినియోగం మన దేశంలో నిషేదించడం జరిగిదని, మాదకద్రవ్యాలు దుర్వినియోగాయానికి దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్ మహమ్మారి బారినపడి యువత జీవితాలను పాడు చేసుకుంటున్నారన్నారు. మొదట చిన్న,చిన్న సరదాలు పోయి అదికాస్త వ్యాసనంగా మారే అవకాశం ఉందని, మాదకద్రవ్యాల వినియోగంలో జీవితాలు చిత్తు అవుతాయని గుర్తించాలన్నారు. జిల్లాలో మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపడం జరుగుతుందని, గంజాయి అక్రమ రవాణా, అమ్మకం మరియు సేవించిన వారి పై చట్ట రిత్య కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు అలవాటుపడిన నేరస్తులపై పి.డి-యాక్ట్ నమోదు చేయడం జరుగుతుందని అన్నారు. విద్యార్థులెవరైయన మాదకద్రవ్యాలు వినియోగించినట్లు తెలిసినట్లైతే అట్టి వారిపై కేసు నమోదు చేసి, విద్యాసంస్థల నుండి టర్మినేట్ చేయించడం జరుగుతుందన్నారు. మీ తల్లిదండ్రులు మీ భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో ఉంటారని గుర్తు చేస్తూ, వారి ఆశ వమ్ముచేయకుండా జీవితంలో ఉన్నత స్థానాలకు చేరాలని సూచించారు. సైబర్ నేరాలు గురించి మాట్లాడుతూ. సైబర్ నేరాలు అనేవి ప్రతి ఒక్కరు ఎదురుకుంటున్న సమస్య అని, సైబర్ నేరాల నుండి బయటపడాలంటే అవగాహన ఒక్కటే మార్గం అని అన్నారు. అత్యాశకు పోయి సైబర్ నేరగాళ్లు పన్నిన వలలో పడవద్దని అన్నారు. జిల్లాలో సైబర్ నేరాలు అధికంగా జరుగుతున్న ప్రాంతాలలో జహీరాబాద్ ఒకటని, సైబర్ నేరాలకు గురవుతున్న వారిలో విద్యావంతులే అధికం అన్నారు. మల్టీ లెవెల్ మార్కెటింగ్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, వంటి ఆన్లైన్ మోసాల పట్ల అవగాహన కలిగి అప్రమత్తంగా ఉండాలని, మొదట డబ్బులు వస్తున్నట్లు ఆశ చూపించి, ఆతర్వాత ఆన్లైన్ మోసాలకు పాల్పడతారని గుర్తించాలన్నారు. డిజిటల్ అరెస్ట్ ల పేరుతో ఏ పోలీసు అధికారి కూడా నేరుగా వాట్స్ ఆప్ వీడియో కాల్స్ చేయరాని, డిజిటల్ అరెస్ట్ అని కాల్స్ వస్తే నమ్మరాదన్నారు. బందులు జబ్బుపడ్డారని, మీకు పార్సిల్ వచ్చిందని అనుమానిత ఫోన్ నెంబర్ల నుండి కాల్స్ వస్తే సంబంధిత పోలీసు స్టేషన్లో సమాచారం అందించాలని లేదా సైబర్ క్రైమ్ పోర్టల్ నందు రిపోర్ట్ చేయాలని సూచించారు. అమాయక ప్రజల బాలహీనతే, సైబర్ మోసగాళ్ల బలంగా.వివిధ రకాల సైబర్ మోసాలకు పాల్పడుతున్నారన్నారు. ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్సీ అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీని వాడుకొని మరిన్ని సైబర్ మోసాలు చేయడానికి ఎక్కువ అవకాశం ఉందన్నారు. కావున ప్రతిఒక్కరు సైబర్ నేరాలపట్ల అవగాహన కలిగి ఉండి అప్రమత్తంగా ఉన్నప్పుడే సైబర్ నేరాల నుండి బయటపడవచ్చని, ఇంటి వద్ద పెద్దవారికి కూడా ఈ సైబర్ మోసాల జరుతున్న తీసరును గురించి అవగాహన కల్పించాలన్నారు. ఎవరైనా సైబర్ నేరాలకు గురి అయినట్లైతే వెంటనే (గోల్డెన్ అవర్)/48 గంటలలోపు 1930 కు కాల్ చేసి గాని, యన్.సి.ఆర్.బి. (https://www.cybercrime.gov.in) పోర్టల్ నందు కాంప్లయింట్ నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ డియస్పి రామ్ మోహన్ రెడ్డి, జహీరాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్ శివలింగం, రూరల్ ఇన్స్పెక్టర్ హనుమంతు, సబ్-డివిజన్ ఎస్ఐ లు వివిధ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థిని, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

హోలీ పండుగను సంప్రదాయ పద్ధతుల్లో సహజ సిద్ధమైన రంగులతో జరుపుకోవాలి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *