
ప్రతి కేసులోనూ నిందితులకు శిక్ష పడేలా కృషి చేయాలి. జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ ఐ.పి.యస్.,
గడిచిన సంవత్సర కాలంలో వివిద కేసుల్లో ఒకరికి ఉరి శిక్ష, 17 మందికి జీవిత ఖైదు.
నిందితులకు శిక్ష పడేవిధంగా కృషి చేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ లకు, సి.డి.ఓలకు ప్రశంసా పత్రాలు
కోర్టు కేసులలో శిక్షల శాతాన్ని పెంచడం, తప్పు చేసిన నిందితులకు శిక్ష పడే విధంగా చేసినప్పుడే నేరాలు తగ్గుముఖం పడతాయనీ ఇందుకు గాను ప్రతి కేసులో నిందితులకు శిక్ష పడే విధంగా కృషి చేయాలని జిల్లా యస్.పి అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ లకు, కోర్ట్ డ్యూటీ ఆఫీసర్ లకి ఏర్పాటు చేసిన అభినందన సభ సమావేశంలో మాట్లాడుతూ ప్రతి కేసుల్లో నిందితులకు దోషులుగా నిరూపించి శిక్షలు పడేలా పని చేయాలని అన్నారు. కోర్టు అధికారులు, ప్రాసిక్యూటర్ల సమన్వయంతో న్యాయ సలహాలు ఆడిగి పని చేయలని అన్నారు. కేసు తుది దశలో సాక్షులను, నిందితులను, బాధితులను సమయానికి కోర్టులో హాజరు పరిచేలా చూసుకోవాలని అన్నారు. నేరస్తులకు శిక్షలు పడేలా పని చేయడంలో సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారితో పాటు కోర్టు డ్యూటీ సిబ్బందికి చాలా బాధ్యత ఉంటుందని చెప్పారు. కోర్టు కేసుల్లో నిందితులకు శిక్షలు పడినప్పుడే నేరాల నియంత్రణ సాధ్యమవుతుందని, తద్వారా ప్రజలకు పోలీస్ శాఖపై మరింత గౌరవం, నమ్మకం పెరుగుతుందని అన్నారు. గడిసిన సంవత్సర కాలంలో జిల్లా వ్యాప్తంగా వివిధ కేసులలో ఒక్కరికీ ఉరిశిక్ష పడగా 17 మందికి జీవిత ఖైదు విధించడం అభినందనీయం అని అన్నారు. ఈ సందర్భంగా నిందితులకు శిక్ష పడే విధంగా కృషి చేసిన ప్రాసిక్యూటర్ లకు మరియు కోర్టు డ్యూటీ అధికారులకు జిల్లా యస్.పి అభిందినందించి ప్రశంసా పత్రాలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి,మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర రాజు,పబ్లిక్ ప్రాసిక్యూటర్ లు శ్రీవాణి, అఖిల, వెంకటేశ్వర్లు, జవహర్ లాల్, రంజిత్ కుమార్, డిసిఆర్బి సిఐ శ్రీను నాయక్, కోర్టు డ్యూటీ అధికారులు పాల్గొన్నారు.
