Breaking News

“అరైవ్ అలైవ్ క్యాంపెయిన్ – లో భాగంగా రహదారి భద్రతపై అవగాహన సదస్సు.

అరైవ్ అలైవ్ క్యాంపెయిన్ లో భాగంగా అమీర్ పేట లోని కమ్మ సంఘం ఫంక్షన్ హాల్ లో రోడ్డు భద్రతా కమిటీలు ఏర్పాటు చేసి, అమీర్ పేట్, ఎల్లారెడ్డి గూడా పంజాగుట్ట ప్రజలకు ట్రాఫిక్ రూల్స్ గురించి అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అవినాష్ కుమార్, IPS, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్-1) మాట్లాడుతూ. వాహనం నడిపేటప్పుడు అత్యంత అప్రమత్తత అవసరమని చెప్పారు. సీట్ బెల్ట్ ప్రాముఖ్యతను వివరించారు. ఎడమ వైపు నుండి ఓవర్‌టేక్ చేయడం ప్రమాదకరమని, సూచించారు. రోడ్ సేఫ్టీ కమిటీ మెంబర్స్ కు అవగాహన కల్పించడంతో పాటు కొన్ని సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించడానికి హామీ ఇవ్వడం జరిగింది. ఖైరతాబాద్ జోన్ ట్రాఫిక్ ఏసిపి ఎస్. మోహన్ కుమార్ మాట్లాడుతూ.ద్విచక్ర వాహనంపై వెళ్లే రైడర్ మరియు వెనుక కూర్చునే వారు (పిలియన్ రైడర్) తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కోరారు. డ్రైవింగ్ చేసే సమయంలో ఫోన్ వంటి సాంకేతిక పరధ్యానాలకు లోనుకావద్దని విద్యార్థులకు హితవు పలికారు. ఈ కార్యక్రమంలో పంజాగుట్ట ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ శ్రీ రామ్ ప్రసాదరావు, ఎస్సైలు ఆంజనేయులు, మోజి రామ్, Ganesh మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అమీర్ పేట్, పంజాగుట్టు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

నేర పరిశోధన, ప్రాసిక్యూషన్ నాణ్యత పెంపుదలే లక్ష్యం: ప్రాసిక్యూషన్ సమీక్షా కమిటీ సమావేశానికి అదనపు పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ అధ్యక్షత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *