
ఖైరతాబాద్ జోన్ పరిధిలోని నారాయణగూడ పోలీసులు కరడుగట్టిన ఒక అంతర్రాష్ట్ర ఇళ్ల దొంగతనాల (House Burglary) నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడు 30-03-2026 నాడు పగటి పూట నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని రెండు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడి, బంగారు ఆభరణాలు మరియు నగదును అపహరించాడు. హఫీజుల్ షేక్, తండ్రి: దివంగత ఖోర్షెడ్ షేక్, కోల్కతా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రం. నిందితుడు పగటి పూట తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి, వాటి తాళాలు పగులగొట్టి లోపల ఉన్న విలువైన వస్తువులను దొంగిలించాలని నిర్ణయించుకున్నాడు. ఈ నిందితుడు గతంలో ఢిల్లీ, కోల్కతా మరియు తెలంగాణ రాష్ట్రాల్లో పలు ఆస్తి సంబంధిత నేరాలలో పాల్గొని జైలుకు వెళ్ళాడు. Cr.No. 97 & 99/2026 U/s 331 (3), 305 BNS, నారాయణగూడ PS, హైదరాబాద్. ఈ కేసు వివరాల ప్రకారం, 30.03.2026న నారాయణగూడ స్ట్రీట్ నెం: 15 నివాసి శ్రీమతి మహ్వీన్ ఫాతిమా మరియు హిమాయత్ నగర్ స్ట్రీట్ నెం: 10 నివాసి యోగేంద్ర ముఖియా నుండి ఫిర్యాదులు అందాయి. నిందితుడు పగటి పూట ఇళ్ల తాళాలు పగులగొట్టి సుమారు రూ. 2,00,000/- విలువైన బంగారం మరియు నగదును దొంగిలించాడు. దీనిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడమైనది. ఖైరతాబాద్ జోన్ డిసిపి శ్రీమతి కె.శిల్పావల్లి ఐపిఎస్ మరియు సుల్తాన్ బజార్ ACP ఆదేశాల మేరకు, నారాయణగూడ SHO ఎం. సైదేశ్వర్, DI బి. అభిలాష్ మరియు DSI సి.హెచ్. నాగరాజు తమ క్రైమ్ సిబ్బందితో కలిసి కీలక పాత్ర పోషించారు. CCTV కెమెరాల పరిశీలన మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, 06-04-2026 నాడు సాయంత్రం 17:30 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు తన ప్లాన్ ప్రకారం మరో నేరం చేయడానికి హైదరాబాద్కు వచ్చిన సమయంలో పట్టుబడ్డాడు. నిందితుడిని క్షుణ్ణంగా విచారించగా, అతను నారాయణగూడ, సనత్ నగర్ మరియు కూకట్పల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో పగటి పూట చేసిన ఆరు (6) ఇళ్ల దొంగతనాల నేరాలను ఒప్పుకున్నాడు. సుల్తాన్ బజార్ డివిజన్ ACP ఎం. మట్టయ్య ప్రత్యక్ష పర్యవేక్షణలో నారాయణగూడ SHO, అడిషనల్ ఇన్స్పెక్టర్, DSI మరియు క్రైమ్ టీం ఈ అరెస్టును విజయవంతంగా నిర్వహించారు. నిందితుడిని పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన పోలీసు బృందాన్ని ఖైరతాబాద్ జోన్ డిసిపి శ్రీమతి కె.శిల్పావల్లి ఐపిఎస్ అభినందించి, వారికి తగిన పురస్కారాలను ప్రకటించారు.
