Breaking News

సంగారెడ్డి జిల్లాలో నెల రోజుల పాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు

సంగారెడ్డి, ఫిబ్రవరి 28:శాంతి భద్రతలను పరిరక్షించేందుకు సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా మార్చి 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఒక నెలపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్–1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ Paritosh Pankaj, ప్రకటించారు.

జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు మరియు వివిధ సంఘాల నాయకులు పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగులు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు.

శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా, ప్రజాధనానికి నష్టం కలిగించే ఎలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలు చేపట్టకూడదని హెచ్చరించారు. ఈ చర్యల అమలులో జిల్లా ప్రజలు పోలీసులకు పూర్తి సహకారం అందించాలని కోరారు.

సంగారెడ్డి జిల్లాలో హనుమాన్ జయంతి శోభాయాత్రలకు పటిష్ట బందోబస్తు: ఎస్పీ పరితోష్ పంకజ్

అనుమతి లేకుండా పై కార్యక్రమాలు నిర్వహించినట్లయితే సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *