Telangana Southern Power Distribution Company Limited (TGSPDCL) మాసబ్ ట్యాంక్ సెక్షన్ ఆపరేషన్స్ విభాగానికి చెందిన అసిస్టెంట్ ఇంజనీర్ మామిడిశెట్టి శ్రీనివాసరావు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.
వివరాల ప్రకారం, సీజ్ చేయబడిన విద్యుత్ మీటర్పై ఎటువంటి కఠిన చర్యలు తీసుకోకుండా ఉండేందుకు ఒక ఫిర్యాదుదారుని నుంచి రూ.16,000 లంచం డిమాండ్ చేశారు. బాధితుడు ఫిర్యాదు చేయడంతో Telangana Anti-Corruption Bureau అధికారులు వల పన్ని, నగదు స్వీకరిస్తున్న సమయంలో రెడ్ హ్యాండెడ్గా అరెస్ట్ చేశారు.
అవినీతి నిరోధక శాఖ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ప్రభుత్వ సేవకులు ఎవరైనా లంచం డిమాండ్ చేసినట్లయితే ప్రజలు టోల్ ఫ్రీ నంబర్ 1064 కు కాల్ చేయాలని అధికారులు సూచించారు. అలాగే వాట్సాప్ (9440446106), ఫేస్బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB), వెబ్సైట్ (acb.telangana.gov.in) ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని స్పష్టం చేశారు.
