Breaking News

అత్తాపూర్ పీఎస్ 2017 హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష

అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2017లో నమోదైన సంచలనాత్మక హత్య కేసు (Cr. No. 737/2017, U/s 302, 201 IPC; SC No. 974/2019)లో రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని X అదనపు జిల్లా & సెషన్స్ జడ్జి కోర్టు జూలై 17, 2026న కీలక తీర్పు వెలువరించింది. నేరం రుజువుకావడంతో నిందితుడు నిసార్ అహ్మద్‌కు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.15,000 జరిమానా విధించింది.

నిందితుడి వివరాలు

  • పేరు: నిసార్ అహ్మద్
  • తండ్రి: లేట్ సిరాజ్ అహ్మద్
  • వయస్సు: 40 సంవత్సరాలు
  • వృత్తి: లెదర్ వ్యాపారి
  • చిరునామా: డోర్ నెం.19, 1వ అంతస్తు, 1వ మెయిన్ రోడ్, 3వ క్రాస్ రోడ్, బెంగళూరు–46, కర్ణాటక.

మృతుడి వివరాలు

  • పేరు: నీసార్ అహ్మద్
  • వయస్సు: 35 సంవత్సరాలు
  • వృత్తి: లెదర్ వ్యాపారి
  • నివాసం: బెంగళూరు.

కేసు వివరాలు

హైదరాబాద్‌లోని మెహదీపట్నం, సంతోష్ నగర్ కాలనీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మహ్మద్ అబ్దుల్ వహీద్ 2017 ఏప్రిల్ 24న అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఏప్రిల్ 19, 2017న రెంటల్ బ్రోకర్ లతీఫుద్దీన్ ద్వారా తమిళనాడులోని వెల్లూరు జిల్లాకు చెందిన ఇంతియాజ్, బెంగళూరుకు చెందిన నీసార్ అహ్మద్ అనే ఇద్దరు వ్యక్తులు మెహదీపట్నంలోని సాజిద్ రెసిడెన్సీలోని ఫ్లాట్ నెం.105ను నెలకు రూ.10,000 అద్దెకు తీసుకున్నారు. అదే రోజు సాయంత్రం ఫ్లాట్‌లోకి ప్రవేశించారు.

ఏప్రిల్ 20న నిందితుడు నిసార్ అహ్మద్ ఫ్లాట్‌కు తాళం వేసి వెళ్లిపోయాడు. అనంతరం ఏప్రిల్ 24న ఫ్లాట్ నుంచి దుర్వాసన రావడంతో యజమాని, బ్రోకర్, వాచ్‌మెన్ కలిసి తాళం తెరిచి చూడగా బాత్రూమ్‌లో కుళ్లిపోయిన స్థితిలో నీసార్ అహ్మద్ మృతదేహం కనిపించింది. మృతుడి నుదుటిపై రాయితో కొట్టిన గాయాలు ఉండగా, మెడకు తాడు చుట్టి ఉన్నట్లు గుర్తించారు.

కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే అమలుకు వేగం.. క్షేత్రస్థాయిలో పరిశీలించిన జీహెచ్‌ఎంసీ కమిషనర్, సీపీ

దర్యాప్తులో వ్యాపార వివాదాల కారణంగా నిందితుడు నిసార్ అహ్మద్ హత్యకు పాల్పడినట్లు తేలింది. అనంతరం అతడిని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.

దర్యాప్తు బృందం

  • దర్యాప్తు అధికారి (IO): జి. సురేష్, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్
  • స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO): ఎ. సీతయ్య, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్, అత్తాపూర్ పోలీస్ స్టేషన్
  • పబ్లిక్ ప్రాసిక్యూటర్లు: టి. వెంకటేశ్వర ప్రసాద్, పి. కృష్ణమూర్తి
  • కోర్టు డ్యూటీ అధికారులు (CDO): ఎ. అమృత (WASI 4732), వెంకటేష్ చారి (PC 6062)
  • సమన్స్ విభాగం: పి. ప్రవీణ్ కుమార్ (HG 986)
  • లైజన్ అధికారులు: ఎస్. నరసింహులు (PC 4384), జి. శివరెడ్డి (ASI)

ఈ కేసులో సమగ్ర దర్యాప్తు నిర్వహించి నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన పోలీసు, ప్రాసిక్యూషన్ బృందాన్ని ఉన్నతాధికారులు అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *