
గత వారం రోజులుగా సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర 4వ పోలీస్ స్పోర్ట్స్ మీట్లో సంగారెడ్డి జిల్లా పోలీసు క్రీడాకారులు విశేష ప్రతిభ కనబరిచి మొత్తం 21 పతకాలు (6-బంగారు, 8-రజత, 7-కాంస్య) సాధించి జిల్లాను ముందు వరుసలో నిలిపారని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్ సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా విజేతలకు పతకాలు అందజేసిన ఎస్పీ మాట్లాడుతూ, క్రీడలు మానసిక దృఢత్వాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. గెలుపు–ఓటములు సహజమని, విజేతలు జాతీయ స్థాయిలో మెరుగైన ప్రదర్శన ఇవ్వడానికి కృషి చేయాలని, ఓటమి చెందిన వారు నిరాశ చెందకుండా తమ లోపాలను సరిదిద్దుకొని ముందుకు సాగాలని సూచించారు. జిల్లాకు పతకాలు తీసుకువచ్చిన క్రీడాకారులందరినీ ప్రత్యేకంగా అభినందించారు. బంగారు పతక విజేతలు: ఈడీ. సజీవ్– బ్యాడ్మింటన్ (50+) సింగిల్స్, బి. ఆదిత్య– సాంప్రదాయ యోగా, బి. ఆదిత్య– ఆర్టిస్టిక్ యోగా సింగిల్, ఆర్. సాయిరామ్– వెయిట్ లిఫ్టింగ్ (60 కేజీలు), కె. జ్యోతి – పవర్ లిఫ్టింగ్, చి. భాగ్యవతి – వెయిట్ లిఫ్టింగ్.
రజత పతక విజేతలు: ఈడీ. సజీవ్– బ్యాడ్మింటన్ (45+) డబుల్స్, జి. సంతోష్ కుమార్– తైక్వాండో (74–80 కేజీలు), డి. మధు– రెజ్లింగ్, ఎల్. చంద్రశేఖర్ – రెజ్లింగ్, ఎల్. చంద్రశేఖర్ – వెయిట్ లిఫ్టింగ్ (60 కేజీలు) ఎన్. చంగున, కె. శ్రావ్య – బ్యాడ్మింటన్, కె. శ్రావ్య – వెయిట్ లిఫ్టింగ్
కాంస్య పతక విజేతలు: కె. శ్రావ్య– షాట్పుట్, వి. దేవి సింగ్– రెజ్లింగ్, కె. సాయి తేజ గౌడ్– బాక్సింగ్ (75–80 కేజీలు), పి. ప్రతాప్ రాథోడ్– వెయిట్ లిఫ్టింగ్ (60 కేజీలు), జె. శివ కుమార్– ఆర్టిస్టిక్ యోగా సింగిల్, ఎల్. రవి కుమార్– రెజ్లింగ్ (77 కేజీలు). ఈ కార్యక్రమంలో, ఎఆర్ డిఎస్పీ నరేందర్, ఆర్.ఐ డానియెల్, రాజశేఖర్ రెడ్డి, ఆర్.ఎస్.ఐ శ్రీశైలం, అశోక్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.
