Breaking News

ఫిర్యాదుదారులతో ప్రత్యక్షంగా మాట్లాడి ఫిర్యాదులు స్వీకరించిన – జిల్లా ఎస్పీ.

ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారం అందించాలనే ఉద్దేశ్యంతో ప్రతి సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజావాణి (గ్రీవెన్స్ డే) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్ తెలియజేశారు. ఈ సందర్భంగా సమస్యలతో జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి స్వయంగా ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను శ్రద్ధగా వినీ, సమస్యలకు సంబంధించిన అంశాలపై సంబంధిత ఎస్‌.హెచ్‌.ఓలతో ఫోన్ ద్వారా మాట్లాడి వివరాలు తెలుసుకుని, ప్రతి కేసును నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధితులకు పూర్తి న్యాయం చేకూర్చాలని ఆదేశించారు. జిల్లా ప్రజలను ఉద్దేశించి ఎస్పీ మాట్లాడుతూ, మీ సమస్యలు స్థానిక పోలీస్ స్టేషన్‌లలో పరిష్కారం దొరకనప్పుడు ఎలాంటి భయాలు, ఒత్తిళ్లకు లోనుకాకుండా జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ప్రజావాణి ద్వారా స్వీకరించిన ప్రతి ఫిర్యాదును ప్రత్యేకంగా పర్యవేక్షిస్తూ, త్వరితగతిన పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.

పెళ్లి పేరిట జరిగే మోసాలు, బ్లాక్ మెయిల్స్ పట్ల యువతులు అప్రమత్తంగా ఉండాలి-వీసీ సజ్జనర్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *