• జాతీయ మెగా లోక్-అదాలత్ లో 1044 కేసులలో పరిష్కారం..
• 56-కేసులలో సైబర్ నేరగాళ్ల చేతిలో కోల్పోయిన రూ: 45.41 లక్షలను తిరిగి బాధితులకు అందేలా కోర్ట్ ఆదేశాలు..
• జాతీయ మెగా లోక్-అదాలత్ ను విజయవంతం చేసిన అధికారులను, సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఒక ప్రకటనలో మాట్లాడుతూ.. జాతీయ మెగా లోక్-అదాలత్ లో భాగంగా, జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీసు స్టేషన్లలో నమోదైన, రాజీ పడటానికి అవకాశం ఉన్నటువంటి మరియు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న 406 – ఐపిసి కేసులలో ఇరు వర్గాలను రాజీ కుదిరచడం జరిగిందని, ఇ-పెట్టి -41, డిడి కేసులు-597 కేసులలో అడ్మిషన్/ జరిమాజన విధించడం జరిగింది.
క్షణికావేశంలో చేసే తప్పులను సరిదిద్దుకోవాడానికి లోక్-అదాలత్ అనేది ఒక మంచి అవకాశం అని, అనవసర గొడవలకు పోయి జీవితాలను ఇబ్బందులపాలు చేసుకోకూడదని అన్నారు. రాజీ మార్గమే రాజా మార్గం అని, రాజీ కుదుర్చుకోవడానికి అవకాశం ఉన్న అన్ని కేసులల్లో ఇరు వర్గాలు రాజీపడవచ్చు అన్నారు.
సంగారెడ్డి జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన సైబర్ నేరాలలో 56 సైబర్ క్రైమ్ కేసులలో రూ: 45.41 లక్షల రూపాయలను తిరిగి సైబర్ బాధితులకు ఇప్పించేందుకు కోర్ట్ నుండి అనుమతి పొందడం జరిగిందని అన్నారు.
లోక్-అదాలత్ ను విజయవంతం చేసిన అధికారులు వర్టికల్ డిఎస్పీ సురేందర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ రమేష్, D4C- డిఎస్పీ ఇన్స్పెక్టర్ రవి, లైజనింగ్ అధికారి సత్యనారాయణ ఎస్ఐ, కోర్ట్ డ్యూటీ, సైబర్ సెల్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
