• ప్రముఖ నాయకులు, సామాజిక సేవకులు వెంకట స్వామి గారి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్..
• ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని వెంకట స్వామి గారికి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, వెంకట స్వామి తమ జీవితాన్ని పూర్తిగా సమాజ సేవకు అంకితం చేసిన గొప్ప వ్యక్తి అని పేర్కొన్నారు. ముఖ్యంగా పేదలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన సేవలు ఎప్పటికీ మరచిపోలేనివని అన్నారు. ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని తెలిపారు.

విద్య, ఆరోగ్యం, ఉపాధి వంటి రంగాలలో వెంకట స్వామి చూపిన దూరదృష్టి, అంకితభావం వల్ల అనేక మంది జీవితాల్లో వెలుగు నిండిందని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే వ్యక్తిత్వం ఆయనకు ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చిందని, వెంకట స్వామి గారి ఆశయాలు, విలువలను ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో ఆచరించాలని జిల్లా ఎస్పీ సూచించారు.
