బ్రేకింగ్ న్యూస్
రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం.. నేపాల్‌ ముఠా సభ్యుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగంహెచ్-సిటీ పనులతో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంనాణ్యమైన దర్యాప్తుతో కేసులను వేగంగా పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్‌లో పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలుచోరీ, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల కొనుగోలు, విక్రయాలపై కఠిన చర్యలుహైదరాబాద్‌లో వాసవి కాలేజ్‌ విద్యార్థులకు ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహననల్లగొండలో వరుస పగటి చోరీలకు చెక్.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్బంజారాహిల్స్‌ అత్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షగంజాయి వ్యసన నిర్మూలనే లక్ష్యం: బాధితులకు మెరుగైన వైద్యం అందించాలితెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి ఘనంగా నిర్వహించిన నల్గొండ జిల్లా పోలీసులురిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం.. నేపాల్‌ ముఠా సభ్యుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగంహెచ్-సిటీ పనులతో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంనాణ్యమైన దర్యాప్తుతో కేసులను వేగంగా పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్‌లో పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలుచోరీ, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల కొనుగోలు, విక్రయాలపై కఠిన చర్యలుహైదరాబాద్‌లో వాసవి కాలేజ్‌ విద్యార్థులకు ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహననల్లగొండలో వరుస పగటి చోరీలకు చెక్.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్బంజారాహిల్స్‌ అత్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షగంజాయి వ్యసన నిర్మూలనే లక్ష్యం: బాధితులకు మెరుగైన వైద్యం అందించాలితెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి ఘనంగా నిర్వహించిన నల్గొండ జిల్లా పోలీసులు
Hyderabad

సైబర్ నేరాలకు ఇక స్వస్తి.. “ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్” ఆరు వారాల ప్రత్యేక కార్యక్రమాలు..

సైబర్ నేరాలకు ఇక స్వస్తి.. “ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్” ఆరు వారాల ప్రత్యేక కార్యక్రమాలు..

• సైబర్ నేరాలకు ఇక స్వస్తి.. “ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్” ఆరు వారాల ప్రత్యేక కార్యక్రమాలు..
• “పైసా పైలాం” అనే అంశంపై గీతం విశ్వవిద్యాలయం విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన..
• ముఖ్య అతిథిగా హాజరైన అధికారి హర్షవర్ధన్ ఐపిఎస్..
• ఆత్మీయ అతిథిగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్..

తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) సహకారంతో, సంగారెడ్డి జిల్లా రుద్రారం గీతం విశ్వవిద్యాలయంలోని విద్యార్థులకు ఆన్లైన్ మోసాల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనా సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీ హర్షవర్ధన్, ఐపిఎస్, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్ 6-వారాల కార్యక్రమంలో భాగంగా సైబర్ నేరాల గురించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన పెంచడం జరుగుతుంది అన్నారు. వేగంగా పెరుగుతున్న సైబర్ నేరాల వలన కలుగుతున్న పరిణామాలు, సైబర్ నేరస్థులు ఉపయోగించే మోసపూరిత పద్ధతులను వివరించడం జరిగింది. సైబర్ మోసగాళ్ళు సంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని, మొబైల్ ఫోన్ లలో హానికరమైన సాఫ్ట్ వేర్ ను ఇన్ స్టాల్ చేసే అవకాశం ఉందని, తద్వారా బ్లాక్ మెయిల్, దోపిడీ, డేటా దుర్వినియోగానికి దారితీయవచ్చు అన్నారు. ఆన్ లైన్ గేమింగ్స్, ఆన్ లైన్ బెట్టింగ్ (ఇది తెలంగాణాలో నిషేధించారు), ఆన్ లైన్ చాటింగ్ లో పాల్గొనేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ.. తప్పుడు మార్గంలో డబ్బులు సంపాదించాలని, పెరిగిన సాంకేతికతను చెడు మార్గంలో వినియోగిస్తున్న సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజలే లక్ష్యంగా ఓటీపీ ఫ్రాడ్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, డిజిటల్ అరెస్టు, హానికరమైన ఏపీకే ఫైల్స్, నకిలీ సోషల్ మీడియా ప్రొఫైళ్లతో సహా, ప్రజలను ఆకర్షితులు చేసే వివిధ రకాల ఆన్ లైన్ మోసాల గురించి విద్యార్థులకు వివరించారు. సైబర్ మోసానికి గురి అయినట్లు గమనించిన వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930కి కాల్ చేసి లేదా cybercrime.gov.in ఫిర్యాదు చేయలని అన్నారు.

ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్ నోడల్ అధికారి డీఎస్సీ కే.వీ. సూర్యప్రకాశ్, బీటెక్ తొలి ఏడాది సమన్వయకర్త ప్రొఫెసర్ పి.త్రినాథరావు, సంగారెడ్డి అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, పటాన్ చెర్వు ఇన్స్పెక్టర్ వినాయక్ రెడ్డి, సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ రవి, ఇన్స్పెక్టర్ సదా నాగరాజు కళాశాల యాజమాన్యం విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం.. నేపాల్‌ ముఠా సభ్యుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగం