బ్రేకింగ్ న్యూస్
హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష – రూ.10,000 జరిమానాప్రజల సమస్యల సత్వర పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమం – అదనపు ఎస్పీ చైతన్య రెడ్డిదర్యాప్తు నాణ్యత, రికార్డుల నిర్వహణ, చట్టాలపై పూర్తి అవగాహనతో విధులు నిర్వహించాలి – జిల్లా ఎస్పీ డా. శబరీష్ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం – గ్రీవెన్స్ డేలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజావాణి – ప్రజల ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రాఆపరేషన్ ముస్కాన్–XII: సంగారెడ్డి జిల్లాలో 173 మంది బాల కార్మికులకు విముక్తి.. 136 కేసులు నమోదుఆపరేషన్ ముస్కాన్ విజయవంతం.. జిల్లాలో 104 మంది బాలబాలికలకు రక్షణబాలానగర్, రాజాపూర్ ఫ్లైఓవర్ పనులు వేగవంతం చేయాలి: జిల్లా ఎస్పీ డి. జానకిఆపరేషన్ ముస్కాన్–XII: నల్లగొండ జిల్లాలో 124 మంది చిన్నారులకు రక్షణ.. 108 కేసులు నమోదువిజయవంతంగా ముగిసిన “ఆపరేషన్ ముస్కాన్–XII”.. 40 మంది చిన్నారులకు రక్షణహత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష – రూ.10,000 జరిమానాప్రజల సమస్యల సత్వర పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమం – అదనపు ఎస్పీ చైతన్య రెడ్డిదర్యాప్తు నాణ్యత, రికార్డుల నిర్వహణ, చట్టాలపై పూర్తి అవగాహనతో విధులు నిర్వహించాలి – జిల్లా ఎస్పీ డా. శబరీష్ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం – గ్రీవెన్స్ డేలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజావాణి – ప్రజల ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రాఆపరేషన్ ముస్కాన్–XII: సంగారెడ్డి జిల్లాలో 173 మంది బాల కార్మికులకు విముక్తి.. 136 కేసులు నమోదుఆపరేషన్ ముస్కాన్ విజయవంతం.. జిల్లాలో 104 మంది బాలబాలికలకు రక్షణబాలానగర్, రాజాపూర్ ఫ్లైఓవర్ పనులు వేగవంతం చేయాలి: జిల్లా ఎస్పీ డి. జానకిఆపరేషన్ ముస్కాన్–XII: నల్లగొండ జిల్లాలో 124 మంది చిన్నారులకు రక్షణ.. 108 కేసులు నమోదువిజయవంతంగా ముగిసిన “ఆపరేషన్ ముస్కాన్–XII”.. 40 మంది చిన్నారులకు రక్షణ
Hyderabad

రోడ్డు ప్రమాదంలో శ్వాస కోల్పోయిన పసికందును సీపీఆర్‌తో బ్రతికించిన రాజేంద్రనగర్ పోలీస్ బృందం

రోడ్డు ప్రమాదంలో శ్వాస కోల్పోయిన పసికందును సీపీఆర్‌తో బ్రతికించిన రాజేంద్రనగర్ పోలీస్ బృందం

రాజేంద్రనగర్ జోన్ పోలీసుల సమయస్ఫూర్తి, మానవత్వంతో వ్యవహరించిన తీరుతో రోడ్డు ప్రమాదంలో శ్వాస కోల్పోయిన ఏడాది పసికందు ప్రాణాలు దక్కాయి. రాజేంద్రనగర్ జోన్ డీసీపీ ఎస్. శ్రీనివాస్ ఆధ్వర్యంలోని నైట్ డ్యూటీ ఎస్కార్ట్ సిబ్బంది తక్షణ చర్యలు తీసుకుని సీపీఆర్ (CPR) అందించడం ద్వారా బాలుడిని కాపాడారు.

జూన్ 18 రాత్రి డీసీపీ ఎస్. శ్రీనివాస్ తన నైట్ డ్యూటీ ఎస్కార్ట్ సిబ్బందితో కలిసి పరిధిలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, బెంగళూరు నుంచి హైదరాబాద్ వైపు వస్తున్న MH14JR 9028 నంబర్ గల కారు శంషాబాద్–ఆరాంఘర్ మార్గంలో అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది.

ప్రమాదం జరిగిన వెంటనే డీసీపీ, సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. కారులో ఉన్న ఏడాది బాలుడు శ్వాస తీసుకోకపోవడంతో పాటు అపస్మారక స్థితిలో ఉండటాన్ని గమనించారు. తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో ఉండగా, డీసీపీ సూచనల మేరకు పోలీసులు వెంటనే బాలుడికి సీపీఆర్ అందించారు.

సిబ్బంది నిరంతర ప్రయత్నాల ఫలితంగా కొద్దిసేపటికే బాలుడు స్పృహలోకి వచ్చి ఏడవడం ప్రారంభించాడు. అనంతరం బాలుడితో పాటు ప్రమాదంలో గాయపడిన వారందరినీ మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు.

హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష – రూ.10,000 జరిమానా

సమయానికి స్పందించి తమ బిడ్డ ప్రాణాలను కాపాడిన డీసీపీ ఎస్. శ్రీనివాస్, పోలీసు సిబ్బందికి బాధిత కుటుంబం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది. తమకు దేవుడిలా అండగా నిలిచారని భావోద్వేగంతో పేర్కొంది.

ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో విశేష సేవలందించిన కార్ హెడ్‌క్వార్టర్స్ సిబ్బంది పీసీ సిహెచ్. మహేష్, పీసీ ప్రదీప్, పీసీ ఎన్. వెంకటేష్, పీసీ పవన్‌లను డీసీపీ ఎస్. శ్రీనివాస్‌తో పాటు ఉన్నతాధికారులు అభినందించారు.