
ఒంటరిగా వెళ్తున్న మహిళలలను టార్గెట్ చేస్తూ వారి మెడలో నుండి బంగారు పూస్తేల తాడులను ఎత్తుకెళ్తున్న అన్నా, తమ్ముళ్లను అరెస్టు చేసిన నల్గొండ పోలిసులు జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ ఐపీఎస్, నిందితుల వద్ద నుండి 19 లక్షల విలువ గల (8 బంగారు పూస్తేల తాడులు, బరువు 19.5 తులాలు), 02 సెల్ ఫోన్లు మరియు దొంగతనం చేయడానికి ఉపయోగించిన 04 మోటారు సైకిళ్ళ ను స్వాధీనం చేసుకోనైనది. క్రైమ్ నెంబర్ 107/2025 U/s 304 (2) BNS of Chandur PS. A-1 రావిరాల పవన్ తండ్రి చంద్రమౌళి, A-2. రావిరాల రాజు తండ్రి చంద్రమౌళి, తేది: 04.07.2025 రోజున చండూర్ మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన మారగోని బుచ్చమ్మ/బాదితురాలు మధ్యాహ్నం అందాజ 02 గంటల సమయంలో తన చెల్క దగ్గరినుండి ఇంటికి నడ్చుకుంటూ వస్తుండగా గొల్లగూడెం గ్రామంలో బాదితురాలి దగ్గరికి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బైక్ పై వచ్చి, వెనుక కూర్చున్న వ్యక్తి బైక్ దిగి బాదితురాలితో ఇడికుడకు దారి ఎటు అని అడుగుతూ మాటల్లో పెట్టి బాదితురాలి మెడలో ఉన్న 03 తులాల పుస్తేల తాడును లాక్కొని వెళ్ళినాడు. ఇట్టి విషయం పై చండూర్ పోలీసు స్టేషన్ లో బాధితురాలి పిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. నల్గొండ SP శరత్ చంద్ర పవార్ ఐపిఎస్, సూచనల మేరకు, నల్గొండ DSP కె. శివరాం రెడ్డి పర్యవేక్షణలో, చండూర్ సి ఐ కె. అది రెడ్డి ఆద్వర్యంలో చండూర్ ఎస్ఐ యన్. వెంకన్న, కనగల్ యస్ ఐ పి. విష్ణు మూర్తి మరియు వారి సిబ్బంది నాలుగు టీమ్ లుగా ఏర్పడి కేసును త్వరితగతిన చేదించడమైనది. 08 బంగారు పూస్తేల తాడులు, బరువు 19.5 తులాలు, వాటి మొత్తం విలువ 19 లక్షలు, 04 మోటారు సైకిళ్లు, 02 సెల్ ఫోన్ లు,ఇట్టి కేసును త్వరితగతిన చేదించిన నల్గొండ DSP K. శివరాం రెడ్డి ని, చండూర్ సి. ఐ కె. అది రెడ్డి ని, చండూర్ ఎస్ఐ యన్. వెంకన్న, కనగల్ యస్.ఐ పి. విష్ణు మూర్తి మరియు వారి సిబ్బంది ఉపేంద్ర చారి, శ్రీకాంత్, కార్తీక్, హరున్, నగేష్, అనిల్, ఖలీల్, రమేష్, నరేందర్ లను నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపిఎస్ అబినందించడం జరిగినది.

