Breaking News

ముత్యాలమ్మ టెంపుల ప్రాతం బ్లాక్ స్పాట్ ను సందర్శించిన-జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ips.

తరచూ ప్రమాదాలకు గురవుతున్న నాగార్జున సాగర్ దయ్యాల గండి, పైలాన్ కాలనీలోని ముత్యాలమ్మ టెంపుల ప్రాతం బ్లాక్ స్పాట్ ను సందర్శించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్. ప్రమాదాలకు గల కారణాలు సంబంధిత అధికారులతో చర్చించి ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృషి. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా నలగొండ జిల్లా ఎస్పీ నిత్యం ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రజల విలువైన ప్రాణాలు కాపాడుటకు చర్యలు చేపడుతూ ప్రమాదాలకు గల కారణాలను ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులతో సమీక్షిస్తూ నివారణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. జిల్లాలోని నేషనల్ హైవే ,స్టేట్ హైవే, ఆర్ అండ్ బి మరియు పంచాయతి రాజ్ ఇంజినీర్లు రోడ్డు ట్రాన్స్పోర్ట్, ఎక్సైజ్,ఎలక్ట్రిసిటీ, ఫారెస్ట్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ బ్లాక్ స్పాట్ గుర్తించి ప్రమాదాలు చర్యల పై రాష్ట్ర రహదారుల సంబంధిత అధికారులకు నివేదిక పంపుతూ అవసరమైన చర్యలు చేపట్టడం జరుగుతుంది. దీనిలో భాగంగా జిల్లా ఎస్పీ నాగర్జున సాగర్ వద్ద సమ్మక్క సారక్క దయ్యాల గండి, పైలాన్ కాలనీలోని ముత్యాల గుడి వద్ద తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాన్ని సందర్శించి అక్కడ ప్రమాదాలు జరుగుటకు గల కారణాలు తెలుసుకొని రానున్న రోజుల్లో సాగర్ సందర్శన కొరకు అధిక సంఖ్యలో పర్యాటకులు సందర్శించనున్నారని వారికి ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా రోడ్డుకు ఇరువైపుల ఉన్న కరెంట్ స్తంభాలను పక్కకు జరిపే విధంగా,రోడ్డుకు ఇరువైపుల మెటల్ బీమ్ క్రాస్ బారియర్,వేగ నియంత్రణ సూచికలు, Bollards, రేడియం స్టడ్స్, బ్లింకింగ్ లైట్స్, రేడియం స్టిక్కర్స్, సంబంధిత అధికారులకు త్వరిత గతిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అంతే కాకుండా జిల్లా రహదారుల వెంట ఉన్న గ్రామాల్లో పోలీసు కళాజాత బృందం ద్వారా ఎప్పటికప్పుడు రోడ్డు ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించున్నారు. రహదారి వెంట ఉన్న గ్రామాలలో విలేజి రోడ్ సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేసి వారి ద్వారా కూడా ప్రమాదాలు జరగకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుచున్నది. ఈ కార్యక్రమంలో నాగార్జున సాగర్ సిఐ శ్రీను నాయక్, యస్.ఐ ముత్తయ్య, DE R&B నేషనల్ హైవే మురళి కృష్ణ,యన్.హెచ్ 565 క్రాంట్రక్టర్ వెంకటేశ్వర్ రావు ,డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ రాఘవరావు,ఎలక్ట్రిసిటీ ఏ.ఈ శేఖర్, ఎక్సైజ్ సీఐ కల్పన, మోటర్ వెహికిల్ ఇన్స్పెక్టర్ సతీష్, సబ్ ఇంజినీర్ గీత, డిటీఆర్బి రిటైర్ సిఐ అంజయ్య మరియు గ్రామ పెద్దలు  పాల్గొన్నారు.

వాలెంటైన్స్ డే సందర్భంగా సైబర్ మోసాలపై హెచ్చరిక.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *