Breaking News

అక్రమంగా మట్టి తవ్వకాలపై జిల్లా టాస్క్ఫోర్స్ పోలీసులు,05 ట్రాక్టర్లు,01జేసిబి స్వాధీనం.

నిబంధనలకు విరుద్ధంగా అక్రమ మట్టి త్రవ్వకలు జరిగిన, రవాణా చేసిన కేసులు తప్పవు. టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ నటేష్. ముస్తాబద్ మండలం చిప్పలపల్లి గ్రామ శివారులో నిబంధనలకు విరుద్ధంగా మట్టి త్రవ్వి తరలిస్తున్నరన్న సమాచారం మేరకు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ నటేష్ ఆధ్వర్యంలో దాడులు చేయగా 05 ట్రాక్టర్లు, ఒక జేసిబి స్వాధీనం చేసుకొని తదుపరి చర్యలు నిమిత్తం ట్రాక్టర్లు, జేసిబి వాటి డ్రైవర్లను ముస్తాబద్ పోలీస్ స్టేషన్ లో అప్పజెప్పడం జరిగింది. ఈ సందర్భంగా టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ నటేష్ మాట్లాడుతూ.నిబంధనలకు విరుద్ధంగా అక్రమ మట్టి త్రవ్వకలు జరిగిన, రవాణా చేసిన కేసులు తప్పవని,జిల్లాలో ఎక్కడైనా మట్టిని తవ్వడం, నిల్వ చేయడం, రవాణా చేయాలంటే ముందస్తుగా సంబంధించిన శాఖ నుండి అనుమతి పొందాలని,లేకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జిల్లా పరిధిలో ఎక్కడైనా అక్రమంగా మట్టిని తరలించినా,తవ్వకాలు చేసినా,నిల్వ చేసినా సమాచారం అందించాలని తెలిపారు.

మహిళల భద్రతే లక్ష్యం: షీ టీమ్స్ సిబ్బందికి రిఫ్రెషర్ కోర్స్ శిక్షణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *