Breaking News

ఆపరేషన్ ముస్కాన్ పకడ్బందీగా నిర్వహిద్దాం-జిల్లా ఎస్పీ మహేష్. బి గితే ఐపిఎస్.

జిల్లా పోలీస్ కార్యలయంలో అపరేషన్ ముస్కాన్ టీమ్ లో ఉన్న అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి ఆపరేషన్ ముస్కాన్ పకడ్బందీగా నిర్వహించాలని జిల్లాలో ఉన్న పరిశ్రమలు,హోటల్స్ , వ్యాపార సముదాయాలు,గోదాములు,మెకానిక్ షాపులు,హోటల్స్, ఇటుక బట్టిలు తదితర ప్రాంతాల్లో వ్యూహాత్మక ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వం సంవత్సరంలో రెండు సార్లు ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ అనే కార్యక్రమాలను నిర్వహించి తప్పిపోయిన బాలలను గుర్తించి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చేలా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్ -XI విజయవంతం కోసం అన్ని శాఖల సమన్వయంతో పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ఈసంవత్సరం జులై 1 నుండి 31 వరకు పోలీస్ శాఖ,చైల్డ్ వెల్ఫేర్ కమిటీ,లేబర్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్, వివిధ డిపార్ట్మెంటు అధికారులతో జిల్లాలో టీమ్ లుగా ఏర్పాటు చేసి ప్రభుత్వేతర స్వచ్చంద సంస్థలను గుర్తించి విస్తృతంగా తనిఖీలు నిర్వహించి జిల్లా వ్యాప్తంగా గడిచిన 10 రోజులలో 31 మంది పిల్లలని గుర్తించి వారి యొక్క తల్లిదండ్రుల వద్దకు చేర్చడం జరిగిందని,18 సంవత్సరాల లోపు పిల్లలను పనిలో పెట్టుకుని వారితో పని చేయిస్తున్న వారిపై 03 కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో సిరిసిల్ల Rdo వెంకటేశ్వర్లు,cmc చైర్పర్సన్ అంజయ్య,సి.ఐ లు నాగేశ్వరరావు,ఎస్.ఐ లు లింబద్రి, లక్పతి, అసిస్టెంట్ లేబర్ అధికారి నజీర్ హమ్మద్, మెడికల్ &హెల్త్ నుండి నయుమ్ జహార్, విద్య శాఖ నుండి శైలజ,ఏ ఏఎస్ఐ ప్రమీల,మహిళా సాధికారత కేంద్రం కోఆర్డినేటర్ రోజా,పోలీస్ అధికారులు,సిబ్బంది అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

హైదరాబాద్‌లో పదవీ విరమణ సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *