Breaking News

14 రోజులుగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు-సిరిసిల్ల పట్టణ ఇన్స్పెక్టర్ కృష్ణ.

డ్రంకన్ డ్రైవ్ లో పట్టుబడిన 27 మందికి,బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ పట్టుబడిన 13 మందికి జరిమానలు. మద్యం సేవించి వాహనాలు నడిపిన, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన జైలు శిక్ష,జరిమానా తప్పదు,సిరిసిల్ల పట్టణ ఇన్స్పెక్టర్ కృష్ణ. సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపీఎస్ ఆదేశాల మేరకు 14 రోజులుగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా 27 మంది మందు బాబులు పట్టుబడగా వారిని సిరిసిల్ల పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టగా 24 మందికి ఒక్కొక్కరికి 1000/- రూపాయలు, ముగ్గురిలో ఒక్కొక్కరికి 1500/- జరిమానా,బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ పట్టుబడిన 13మందిలో ఒక్కొక్కరికి 1000/- రూపాయలు జరిమానా విధిస్తు మేజిస్ట్రేట్ జయశ్రీ తీర్పు వెల్లడించినట్లు టౌన్ ఇన్స్పెక్టర్ కృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన మందు బాబులకు సిరిసిల్ల ట్రాఫిక్ ఆర్.ఎస్.ఐ దిలీప్ ఆధ్వర్యంలో మందుబాబులకు ఇంకెప్పుడు మద్యం సేవించి వాహనాలు నడపమని ప్రతిజ్ఞ చేపించారు. ప్రతి రోజు పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు,వాహన తనిఖీలు నిర్వహించాడం జరిగుతుందని, మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడిన వ్యక్తుల పై,బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ పట్టుబడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతు పట్టుబడిన వారికి వారి తల్లితండ్రుల, లేదా కుటుంబ పెద్దల సమక్షంలో కౌన్సెల్లింగ్ ఇవ్వడం జరిగుతుందని అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపి పట్టుబడితే భవిష్యత్తులో వచ్చే ఉద్యోగ అవకాశాలు కానీ, ఉపాధి అవకాశలకు పోలీస్ వెరైఫికేషన్ సమయంలో ఇబ్బందులు కలుగుతయని,ట్రాఫిక్, రోడ్ భద్రత నియమ నిబంధనలను ఉల్లంఘిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మహిళల భద్రతే లక్ష్యం: షీ టీమ్స్ సిబ్బందికి రిఫ్రెషర్ కోర్స్ శిక్షణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *