
గడిచిన ఆరు నెలల్లో 48 కేసుల్లో నిందితులుగా ఉన్న వారికి జైలు శిక్షలు. నిందితులకు శిక్ష పడే విధంగా కృషి చేసిన పిపి లను,కోర్టు కానిస్టేబుళ్లను అభినందించి ప్రశంసా పత్రాలు,ప్రోత్సాహకాలు. కోర్టు కేసుల్లో నేరస్తులకు శిక్ష పడేలా చేయడం,శిక్షల శాతాన్ని పెంచడం ద్వారా సమాజంలో మంచి మార్పు తీసుకురావచ్చని జిల్లా ఎస్పీ సూచించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో కోర్టు కేసులకు సంబంధించిన కేసుల్లో నిందితులకు శిక్షల పడేలా కృషి చేసిన పీపీలను,కోర్టు కానిస్టేబుళ్లను అభినదించి ప్రశంస పత్రాలు అందజేసిన జిల్లా ఎస్పీ. నిందితులకు శిక్షపడుటలో పోలీసులతో పాటు పబ్లిక్ ప్రాసిక్యూటర్లది కీలకపాత్రని,పోలీసు అధికారులు,పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సమన్వయoతో నేరస్థులకు ఖచ్చితంగా శిక్ష పడేవిధంగా కృషి చేయాలని సూచించారు. ప్రధాన కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా కృషి చేసి శిక్షల శాతం పెరిగేలా పని చేయటం అభినదనియమని అన్నారు. పోలీస్ ఆదికారులు న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ నేరస్థులకు ఖచ్చితంగా శిక్ష పడేవిధంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని సూచించారు. పోక్సో,హత్య కేసులను ప్రధానమైనవిగా భావించి ముందుకు సాగాలని సూచించారు. ప్రస్తుత రోజుల్లో సాంకేతికత కీలకంగా మారిందని అన్ని కేసుల్లో సైంటిఫిక్ ఆధారాలు కచ్చితంగా జమ చేయాలన్నారు. గడిచిన ఆరు నెలల కాలంలో 48 కేసుల్లో నిదితులకు శిక్ష పడేవిధంగా కృషి చేసిన పీపీలు వేముల లక్ష్మీ ప్రసాద్ , శ్రీనివాస్,లక్ష్మణ్,సందీప్,సతీష్,విక్రాంత్,సి.ఐ లు,ఎస్.ఐ లు,CMS ఎస్.ఐ లు శ్రవణ్ యాదవ్, రవీంద్రనాయుడు,పోలీస్ స్టేషన్ల కోర్టు కానిస్టేబుళ్లను అభినందించి ప్రసంశ పత్రాలు అందించారు. ముస్తాబద్ పోలీస్ స్టేషన్ కి సంబంధించిన హత్య కేసులో ముగ్గురు నిందుతులకు జీవిత ఖైదు పడటంతో కృషి చేసిన కోర్ట్ కానిస్టేబుల్ దేవేందర్ , రాజేందర్,CMS కానిస్టేబుల్ నవీన్ లను ప్రత్యేకంగా అభినందించారు.
