Breaking News

గ్రీవెన్స్ డే పలు ఫిర్యాదులను పరిశీలించిన – జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ IPS.

బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు ఆదేశం. ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే లో బాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 68 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయడం లక్ష్యంగా ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నామని అన్నారు. పోలీస్ స్టేషన్ కి వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి వినతులు స్వీకరించి సంబంధిత ఫిర్యాదులపై క్షేత్ర స్థాయిలో పరిశీలించి వేగంగా స్పందించి బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడడం జరుగుతోందని ఎస్పి తెలిపారు. ఎస్పీ ఆఫీస్ కి, పోలీస్ స్టేషన్ కి వచ్చే ఫిర్యాదు దారులు మధ్యవర్తులని తీసుకురావద్దని బాధితులు మాత్రమే వచ్చి ప్రత్యక్షంగా కలిసి ఫిర్యాదుకు సంబంధించిన విషయాలు తెలపాలని ఎస్పి  తెలిపారు.

హైదరాబాద్‌లో పదవీ విరమణ సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *