Breaking News

మొహర్రం-బీబీ కా ఆలం ఊరేగింపు హైదరాబాద్‌లో ప్రశాంతంగా ముగిసింది.

మొహర్రం సంతాప దినాలలో భాగంగా, 10వ మొహర్రం సందర్భంగా జరిగిన బీబీ కా ఆలం ఊరేగింపు హైదరాబాద్‌లో ప్రశాంతంగా ముగిసింది. సి.వి. ఆనంద్ ఐపిఎస్ డిజి మరియు కమిషనర్ ఆఫ్ పోలీస్, స్వయంగా చారిత్రక చార్మినార్ వద్ద ఉండి బందోబస్తును పర్యవేక్షించారు. ఊరేగింపు ప్రశాంతంగా జరిగేలా అధికారులందరికీ ఎప్పటికప్పుడు తగిన సూచనలు అందించారు. గత 10 రోజుల నుండి మొహర్రం సంతాప దినాలకు సి.వి. ఆనంద్ అధ్వర్యంలో హైదరాబాద్ నగర పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, సమర్థవంతమైన ట్రాఫిక్ నిర్వహణ చేపట్టారు. బీబీ కా ఆలం యొక్క ఈ భారీ ఊరేగింపు దబీర్‌పురా(దారుల్ షిఫా) లోని ఆషుర్‌ఖానా నుండి ప్రారంభమైంది. కర్ణాటక రాష్ట్రం నుండి తీసుకువచ్చిన లక్ష్మి ఏనుగుపై “ఆలం”ను ఉంచి ఈ యాత్ర కొనసాగింది. అనంతరం ఈ ఊరేగింపు మూసీ నది ఒడ్డున ఉన్న మసీద్-ఎ-ఇలాహీ, చాదర్‌ఘాట్ వద్ద ముగిసింది. నగర పోలీస్ కమిషనర్ సి.వి. ఆనంద్, లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ విభాగాల సీనియర్ అధికారులతో కలిసి ఊరేగింపును పర్యవేక్షించారు. హైదరాబాద్ సిటీ పోలీసుల తరపున చార్మినార్ వద్ద ఆలంకు పూలమాలలు మరియు దట్టీలు సమర్పించారు. ఈ బిబీకా ఆలం ఊరేగింపుకు 3,000 మందికి పైగా పోలీసు సిబ్బందితో పటిష్ట భద్రత కల్పించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు ప్రణాళికలతో అన్ని చర్యలు చేపట్టడం వలన హైదరాబాద్‌లో బీబీ కా ఆలం ఊరేగింపు ప్రశాంతంగా ముగిసింది. ఈ సందర్భంగా సి.వి. ఆనంద్ ఐపిఎస్, డిజి మరియు కమిషనర్ ఆఫ్ పోలీస్, హైదరాబాద్‌లోని షియా కమ్యూనిటీ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో విక్రమ్ సింగ్ మాన్ ఐపిఎస్ (అదనపు కమిషనర్ ఆఫ్ పోలీసు L&O),డి. జోయెల్ డేవిస్ ఐపిఎస్ (జాయింట్ సిపి ట్రాఫిక్), రక్షిత కృష్ణ మూర్తి ఐపిఎస్ (డిసిపి CAR హెడ్‌క్వార్టర్స్), స్నేహా మెహ్రా ఐపిఎస్ (డిసిపి సౌత్ జోన్) తో పాటు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

మహిళల భద్రతే లక్ష్యం: షీ టీమ్స్ సిబ్బందికి రిఫ్రెషర్ కోర్స్ శిక్షణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *