Breaking News

హైదరాబాదు నగర ట్రాఫిక్ పోలీస్ విభాగం కట్టుదిట్టమైన చర్యలు.

ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనకు వ్యతిరేకంగా హైదరాబాదు నగర ట్రాఫిక్ పోలీస్ విభాగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో, గడచిన రెండు రోజులలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు అబిడ్స్, చిక్కడపల్లి, సైఫాబాద్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలో పట్టుబడ్డ వ్యక్తులను కౌన్సిలింగ్ నిర్వహించిన పిదప, విచారణ నిమిత్తం మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు, నాంపల్లి హైదరాబాద్ లో ప్రవేశపెట్టటం జరిగింది.
ఈ విచారణలో మొత్తం (105) మంది నిందితులను హాజరు పరచగా, వారిలో (75) మందికి ప్రతి ఒక్కరికి రూ.2100 /- చొప్పున జరిమానా విధించబడింది,(12) మందికి ప్రతి ఒక్కరికి రూ.3100/- చొప్పున జరిమానా విధించబడింది,(01) వ్యక్తి కి కోర్టు రైజింగ్ మరియు రూ. 3300/ – జరిమానా విధించబడింది,(17) వ్యక్తులకు కోర్టు జైలు మరియు రూ. 41000/ – జరిమానా విధించబడింది,ఈ విచారణలో మొత్తం రూ.239000 /- జరిమానాగా కోర్టు ద్వారా విధించబడింది. ఈ చర్యలు ట్రాఫిక్ నియమాలను పాటించకపోవడం వల్ల ఏర్పడే ప్రమాదాలను తగ్గించడమే కాకుండా, ప్రజల్లో అవగాహన పెంచే ఉద్దేశంతో చేపట్టబడ్డాయి. ప్రజలందరూ ట్రాఫిక్ నియమాలను గౌరవిస్తూ, ఇతరుల ప్రాణాల కోసం బాధ్యతతో ప్రవర్తించగలరని ట్రాఫిక్ పోలీసులు ఆశిస్తున్నారు. డ్రైవింగ్ సమయంలో మద్యం సేవించడం వల్ల ఎంతటి నష్టాలు జరగవచ్చో ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన అవసరం ఉంది.

మహిళల భద్రతే లక్ష్యం: షీ టీమ్స్ సిబ్బందికి రిఫ్రెషర్ కోర్స్ శిక్షణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *