Breaking News

రాజేశ్వర్ ఎస్ఐ మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన – జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్.

•రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఎస్ఐ యం.రాజేశ్వర్ గౌడ్ భౌతికకాయానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు.

మహిళల భద్రతే లక్ష్యం: షీ టీమ్స్ సిబ్బందికి రిఫ్రెషర్ కోర్స్ శిక్షణ
  • రాజేశ్వర్ ఎస్ఐ మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్
    •అంత్య క్రియాలకు హాజరైన జిల్లా అదనపు ఎస్పీ ఎ.సంజీవరావ్.
    హైదరాబాద్, ఫిల్మ్ నగర్ ఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ యం.రాజేశ్వర్ గౌడ్, నిన్న తేది: 02.07.2025, రాత్రి బల్కంపేట ఎల్లమ్మ బోనాల బందోబస్తు ను ముగించుకొని తన కారులో ఇంటికి సంగారెడ్డి వస్తుండగా మార్గమద్యలో అనగా సంగారెడ్డి రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలో గల చర్యాల x-రోడ్డు వద్ద తేది: 03.07.2025, అందాజ 1:30 గంటల సమయంలో రోడ్డు ప్రమాదం జరిగి, చికిత్స కొరకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ. యం.రాజేశ్వర్ గౌడ్ ఎస్ఐ 1990లో జిల్లా పోలీసు శాఖలో కానిస్టేబుల్ గా నియామకమై, ఉమ్మడి మెదక్ జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్ లలో సాధారణ విధులతో పాటు స్టేషన్ రైటర్ గా విధులను నిర్వహించారు. అనంతరం జిల్లా టెక్నికల్/కంప్యూటర్ విభాగంలో సుమారు 15 సంవత్సరాలుగా ఐటి సెల్ ఇంచార్జ్ గా విధులను నిర్వహించారు. ఆయనకు భార్య గాయత్రి మరియు ఇద్దరు పిల్లల సంతానం కలదు. రాజేశ్వర్ గౌడ్, ఎస్ఐ జిల్లా పోలీసు శాఖలో అందించిన సేలను కొనియాడుతూ, ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబసభ్యులకు జిల్లా పోలీసు శాఖ ఎల్ల వేళలా అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి డియస్పీ సత్యయ్య గౌడ్, ఆర్.ఐ రామరావ్, ఆర్మూడ్ సిబ్బంది, ఐ.టి సెల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *