
భద్రాద్రి జోనల్ పరిధిలో జరిగిన పోలీస్ డ్యూటీమీట్ లో మహబూబాబాబ్ జిల్లాకు 4 బంగారు, 9 రజత, 3 కాంస్య పతకాలు లభించాయి. మొత్తం 16 పతకాలను మహబూబాబాద్ జిల్లా పోలీస్ లు సాధించారు. బాంబు స్క్వాడ్ విభాగంలో పిసి రామయ్యకు ( గోల్డ్ 01, సిల్వర్01), అశోక్ పిసి(గోల్డ్ 01, సిల్వర్ 01), పిసి వి మహేష్ ( గోల్డ్ 01, సిల్వర్ 01), పిసి ఏ మహేష్ (సిల్వర్ 01), పిసి రాములు (గోల్డ్ 01), వీడియో గ్రాఫర్ విభాగంలో పిసి కుషాల్ కుమార్(సిల్వర్ 01), అబ్జర్వేషన్ విభాగంలో పిసి మధు (సిల్వర్ 01), ఫింగర్ ప్రింట్ విభాగంలో ఎస్ ఐ ప్రవీణ్ (కాంస్య 01), పోలీస్ పోర్ట్రైట్ విభాగంలో పిసి మధు(సిల్వర్ 01), కంప్యూటర్ అవేర్నెస్ విభాగంలో పిసి సుమన్(సిల్వర్ 01) అబ్దుల్ కధీర్ (గోల్డ్, బ్రంజ్) మొత్తం 16 మెడల్స్ సాధించారు. మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుదీర్ రాంనాథ్ కేకన్ IPS ఆదేశానుసరం మహబూబాబాద్ జిల్లా నుండి నోడల్ ఆఫీసిర్ గా డిఎస్పీ శ్రీనివాస్ మరియు వారికీ కోచ్ గా బీడీ టీం పీసీ అంజయ్య టీం సభ్యులకు ప్రోత్సాహన్ని అందించారు. ఈ పతకాలను వరంగల్ పోలీస్ కమీషనరేట్ లోని రాణీ రుద్రమదేవి హాల్ నందు వరంగల్ సిపి సన్ ప్రీత్ సింగ్ అందజేశారు.
