
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య 92వ జయంతిని పురస్కరించుకుని జిల్లా పోలీస్ కార్యాలయంలో అదనపు ఎస్పీ ఎ. సంజీవరావ్, రోశయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ. కొణిజేటి రోశయ్య భారత రాజకీయ వేత్త, ఈయన 1933లో గుంటూరు జిల్లా, తెనాలి మండలం, వేమూరు గ్రామంలో జన్మించారు. ఆయనకు చిన్నప్పటినుండే రాజకీయ లక్షణాలుండి విద్యార్థి నాయకునిగా ఎదిగాడు. 2009-2010, 2-సంవత్సరాల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా 2011 – 2016 వరకు తమిళనాడు గవర్నర్గా, అనంతరం రెండు నెలల పాటు కర్ణాటక గవర్నర్గా (అదనపు బాధ్యత) పదవి భాద్యతలు చేపట్టారు. ఆయన గతంలో అనేకసార్లు భారత జాతీయ కాంగ్రెస్ నుండి MLC, MLA మరియు MPగా ఎన్నికయ్యారు. ఆయన రాజకీయ జీవితంలో అనేక మంత్రి పదవులను నిర్వహించారు అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ అధికారి ఇ కళ్యాణి, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ రమేష్, ఆర్.ఐ. డానియోల్, యస్.బి. ఎస్ఐ యాదవ రెడ్డి, మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

