జిల్లా పోలీస్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహించి పదవి విరమణ పొందిన మల్లయ్యకు అధికారులు, సహచర సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య పూలమాల వేసి, శాలువాతో సన్మానించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, పోలీస్ శాఖలో మల్లయ్య అంకితభావంతో పనిచేసి అందరి మన్ననలు పొందారని అదనపు ఎస్పీ ప్రశంసించారు. జిల్లా పోలీస్ విభాగంలో సుదీర్ఘకాలం సేవలు అందించి పదవీ విరమణ పొందిన ఆయన సేవలను ఎప్పటికీ మరువలేమని అన్నారు.
పదవీ విరమణ అనేది కేవలం ఉద్యోగానికి మాత్రమేనని, వ్యక్తిత్వానికి కాదని పేర్కొన్నారు. కుటుంబంలో ఎలాంటి సమస్య వచ్చినా తనను సంప్రదించవచ్చని మల్లయ్యకు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేషన్ అధికారి పద్మ, సూపరింటెండెంట్లు, సీనియర్ మరియు జూనియర్ అసిస్టెంట్లు, కార్యాలయ సిబ్బంది, మల్లయ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
