Breaking News

టోలిచౌకి పోలీస్ స్టేషన్ పరిధిలో సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం–డీసీపీ జి. చంద్ర మోహన్.

సైబర్ నేరాల పట్ల ప్రజలను అప్రమత్తం చేసేందుకు హైదరాబాద్ సిటీ పోలీస్ వినూత్న కార్యక్రమాలను చేపట్టింది. ఇందులో భాగంగా గోల్కొండ జోన్ డీసీపీ జి. చంద్ర మోహన్, ఐపీఎస్ టోలిచౌకి పోలీస్ స్టేషన్ పరిధిలో ‘సైబర్ క్రైమ్ అవేర్‌నెస్ ఆటో క్యాంపెయిన్’ (ఆటో ద్వారా ప్రచారం)ను ప్రారంభించారు. పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టమ్ (మైకు) అమర్చిన ప్రత్యేక ఆటో ద్వారా టోలిచౌకిలోని ప్రధాన కూడళ్లు మరియు నివాస ప్రాంతాల్లో సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పిస్తారు. ఫోన్లకు వచ్చే అనుమానాస్పద లింక్‌ల పట్ల జాగ్రత్తగా ఉండటం. వ్యక్తిగత వివరాలు, ఓటీపీ (OTP)లను ఎవరికీ తెలపకూడదు. రిమోట్ యాక్సెస్ యాప్‌ల ద్వారా జరిగే మోసాల గురించి ప్రజలకు వివరించడం. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 కి కాల్ చేయాలని సూచించడం. ఈ కార్యక్రమంలో టోలిచౌకి ఇన్‌స్పెక్టర్ రమేష్ నాయక్, డి.ఐ. జి. బాలరాజ్, అడ్మిన్ ఎస్.ఐ. సతీష్ కుమార్ మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

అక్రమంగా తరలిస్తున్న 8 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం – ఒకరు అరెస్ట్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *