
గోషామహల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా ఆన్లైన్ బెట్టింగ్కు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. యువతను లక్ష్యంగా చేసుకుని నిర్వహిస్తున్న ఈ బెట్టింగ్ కార్యకలాపాలపై సమాచారం అందుకున్న పోలీసులు మెరుపు దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నమ్మదగిన సమాచారం మేరకు, గోషామహల్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. CricCode, Stake, మరియు Future Play వంటి వెబ్సైట్ల ద్వారా అక్రమంగా ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు గుర్తించి, ముగ్గురు నిందితులను పట్టుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు జరుపుతున్నారు.
- అనురాగ్ రామవత్ తండ్రి చంద్రప్రకాష్ రామవత్,జిల్లా రాజస్థాన్), 2. ధవల్ ఖత్రీ తండ్రి నరేందర్ కుమార్ ఖత్రీ,హైదరాబాద్, 3. కృష్ణ తండ్రి నంద్ కిషోర్,హైదరాబాద్. ఐఫోన్ 17 (I Phone 17) – 01,ఐఫోన్ 15 ప్రో (I Phone 15 Pro) – 01,ఒప్పో రెనో 2ఎఫ్ (Oppo Reno 2F) – 01.
ఆన్లైన్ బెట్టింగ్కు పాల్పడే వారు, నిర్వహించే వారు మరియు ప్రోత్సహించే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. తల్లిదండ్రులు తమ పిల్లల ఆన్లైన్ కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంచాలి. బెట్టింగ్ వల్ల కలిగే ప్రమాదాలు మరియు చట్టపరమైన పర్యవసానాల గురించి వారికి అవగాహన కల్పించాలి. ఇటువంటి అక్రమ కార్యకలాపాల గురించి తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని కోరుతున్నాము. ఈ ఆపరేషన్ను గోల్కొండ జోన్ డీసీపీ చంద్ర మోహన్, గోషామహల్ ఏసీపీ ఎస్. సుదర్శన్ పర్యవేక్షణలో, గోషామహల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు పీసీ 2152 పి. మనీష్ కుమార్ యాదవ్ విజయవంతంగా నిర్వహించారు.
