బ్రేకింగ్ న్యూస్
డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం.. గూడూరులో 1,000 మందికి పైగా విద్యార్థులతో 2K రన్హైదరాబాద్‌లో 38 కిలోల ఎండు గంజాయి స్వాధీనం.. ఐదుగురు అరెస్ట్నకిలీ నంబర్ ప్లేట్లపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఉక్కుపాదంనాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ హత్య కేసులో సంచలన విషయాలు.. ఇద్దరు టెన్త్ క్లాస్ విద్యార్థుల అరెస్ట్‘బాబు’ అనే ఒక్క మాటతో వీడిన ప్రిన్సిపల్ హత్య మిస్టరీకేసుల సత్వర పరిష్కారం, నేరస్తులకు శిక్షలు పడేలా చేయడంలో సీడీఓల పాత్ర కీలకం: జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్హై-పవర్డ్ కమిటీ చర్లపల్లి ప్రిజనర్స్ అగ్రికల్చరల్ కాలనీ సందర్శనప్రజావాణిలో ప్రజల ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా ఎస్పీ డి. జానకి, ఐపీఎస్నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి: పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలిప్రతి పిటిషన్‌ను నిర్ణీత సమయంలో పరిశీలించి పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ డా. శబరీష్డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం.. గూడూరులో 1,000 మందికి పైగా విద్యార్థులతో 2K రన్హైదరాబాద్‌లో 38 కిలోల ఎండు గంజాయి స్వాధీనం.. ఐదుగురు అరెస్ట్నకిలీ నంబర్ ప్లేట్లపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఉక్కుపాదంనాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ హత్య కేసులో సంచలన విషయాలు.. ఇద్దరు టెన్త్ క్లాస్ విద్యార్థుల అరెస్ట్‘బాబు’ అనే ఒక్క మాటతో వీడిన ప్రిన్సిపల్ హత్య మిస్టరీకేసుల సత్వర పరిష్కారం, నేరస్తులకు శిక్షలు పడేలా చేయడంలో సీడీఓల పాత్ర కీలకం: జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్హై-పవర్డ్ కమిటీ చర్లపల్లి ప్రిజనర్స్ అగ్రికల్చరల్ కాలనీ సందర్శనప్రజావాణిలో ప్రజల ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా ఎస్పీ డి. జానకి, ఐపీఎస్నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి: పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలిప్రతి పిటిషన్‌ను నిర్ణీత సమయంలో పరిశీలించి పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ డా. శబరీష్
Telangana

ఆన్‌సైట్ ఎఫ్‌ఐఆర్‌తో బాధితుల వద్దకే పోలీసులు – మహబూబాబాద్‌లో సత్వర న్యాయానికి కొత్త సేవ

ఆన్‌సైట్ ఎఫ్‌ఐఆర్‌తో బాధితుల వద్దకే పోలీసులు – మహబూబాబాద్‌లో సత్వర న్యాయానికి కొత్త సేవ

మహబూబాబాద్ జిల్లా పోలీసులు అమలు చేస్తున్న “ఆన్‌సైట్ ఎఫ్‌ఐఆర్” విధానం ద్వారా ప్రజలకు మరింత చేరువగా పోలీస్ సేవలు అందుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా పరిధిలో పోలీస్ స్టేషన్‌కు రాలేని పరిస్థితుల్లో ఉన్న బాధితుల వద్దకే వెళ్లి ఫిర్యాదులు నమోదు చేయడం ఈ సేవ ప్రత్యేకత. దీంతో బాధితులు స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా తక్షణమే న్యాయం పొందే అవకాశం కలుగుతోంది.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డా. శబరీష్ IPS మాట్లాడుతూ, జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 35 ఆన్‌సైట్ ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ విధానం వల్ల బాధితులకు వేగంగా న్యాయం అందడమే కాకుండా, పోలీస్ సేవలపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని పేర్కొన్నారు.

మహిళలు మరియు చిన్నారులపై నేరాలు, లైంగిక నేరాలు, ఎస్సీ/ఎస్టీ అఘాయిత్యాలు, ఆస్తి సంబంధిత నేరాలు, వృద్ధులపై నేరాలు, డౌరీ, చైల్డ్ మ్యారేజ్, ర్యాగింగ్ వంటి ప్రత్యేక చట్టాల కింద కేసులు, అలాగే పోలీస్ స్టేషన్‌కు రాలేని ఇతర బాధితుల ఫిర్యాదులను ఈ విధానం ద్వారా నమోదు చేస్తున్నారు.

డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం.. గూడూరులో 1,000 మందికి పైగా విద్యార్థులతో 2K రన్

ప్రత్యేకంగా మహిళలు, వృద్ధులు మరియు దూర ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఈ సేవ ఎంతో ఉపయోగకరంగా నిలుస్తోందని అధికారులు తెలిపారు. బాధితుల వద్దకే చేరుకుని ఫిర్యాదు నమోదు చేయడం వల్ల సమయం ఆదా కావడంతో పాటు, నేరాలపై వేగంగా చర్యలు తీసుకునే అవకాశం లభిస్తోంది.

బాధితులకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా ఈ సేవను మరింత విస్తరించేందుకు కట్టుబడి ఉన్నామని ఎస్పీ తెలిపారు. మహబూబాబాద్ జిల్లా ప్రజలు ఈ సేవను వినియోగించుకుని నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని కోరారు.