Breaking News

ఆన్‌సైట్ ఎఫ్‌ఐఆర్‌తో బాధితుల వద్దకే పోలీసులు – మహబూబాబాద్‌లో సత్వర న్యాయానికి కొత్త సేవ

మహబూబాబాద్ జిల్లా పోలీసులు అమలు చేస్తున్న “ఆన్‌సైట్ ఎఫ్‌ఐఆర్” విధానం ద్వారా ప్రజలకు మరింత చేరువగా పోలీస్ సేవలు అందుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా పరిధిలో పోలీస్ స్టేషన్‌కు రాలేని పరిస్థితుల్లో ఉన్న బాధితుల వద్దకే వెళ్లి ఫిర్యాదులు నమోదు చేయడం ఈ సేవ ప్రత్యేకత. దీంతో బాధితులు స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా తక్షణమే న్యాయం పొందే అవకాశం కలుగుతోంది.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డా. శబరీష్ IPS మాట్లాడుతూ, జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 35 ఆన్‌సైట్ ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ విధానం వల్ల బాధితులకు వేగంగా న్యాయం అందడమే కాకుండా, పోలీస్ సేవలపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని పేర్కొన్నారు.

మహిళలు మరియు చిన్నారులపై నేరాలు, లైంగిక నేరాలు, ఎస్సీ/ఎస్టీ అఘాయిత్యాలు, ఆస్తి సంబంధిత నేరాలు, వృద్ధులపై నేరాలు, డౌరీ, చైల్డ్ మ్యారేజ్, ర్యాగింగ్ వంటి ప్రత్యేక చట్టాల కింద కేసులు, అలాగే పోలీస్ స్టేషన్‌కు రాలేని ఇతర బాధితుల ఫిర్యాదులను ఈ విధానం ద్వారా నమోదు చేస్తున్నారు.

వరుస దేవాలయ దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడు అరెస్ట్

ప్రత్యేకంగా మహిళలు, వృద్ధులు మరియు దూర ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఈ సేవ ఎంతో ఉపయోగకరంగా నిలుస్తోందని అధికారులు తెలిపారు. బాధితుల వద్దకే చేరుకుని ఫిర్యాదు నమోదు చేయడం వల్ల సమయం ఆదా కావడంతో పాటు, నేరాలపై వేగంగా చర్యలు తీసుకునే అవకాశం లభిస్తోంది.

బాధితులకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా ఈ సేవను మరింత విస్తరించేందుకు కట్టుబడి ఉన్నామని ఎస్పీ తెలిపారు. మహబూబాబాద్ జిల్లా ప్రజలు ఈ సేవను వినియోగించుకుని నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *