బ్రేకింగ్ న్యూస్
డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం.. గూడూరులో 1,000 మందికి పైగా విద్యార్థులతో 2K రన్హైదరాబాద్‌లో 38 కిలోల ఎండు గంజాయి స్వాధీనం.. ఐదుగురు అరెస్ట్నకిలీ నంబర్ ప్లేట్లపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఉక్కుపాదంనాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ హత్య కేసులో సంచలన విషయాలు.. ఇద్దరు టెన్త్ క్లాస్ విద్యార్థుల అరెస్ట్‘బాబు’ అనే ఒక్క మాటతో వీడిన ప్రిన్సిపల్ హత్య మిస్టరీకేసుల సత్వర పరిష్కారం, నేరస్తులకు శిక్షలు పడేలా చేయడంలో సీడీఓల పాత్ర కీలకం: జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్హై-పవర్డ్ కమిటీ చర్లపల్లి ప్రిజనర్స్ అగ్రికల్చరల్ కాలనీ సందర్శనప్రజావాణిలో ప్రజల ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా ఎస్పీ డి. జానకి, ఐపీఎస్నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి: పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలిప్రతి పిటిషన్‌ను నిర్ణీత సమయంలో పరిశీలించి పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ డా. శబరీష్డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం.. గూడూరులో 1,000 మందికి పైగా విద్యార్థులతో 2K రన్హైదరాబాద్‌లో 38 కిలోల ఎండు గంజాయి స్వాధీనం.. ఐదుగురు అరెస్ట్నకిలీ నంబర్ ప్లేట్లపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఉక్కుపాదంనాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ హత్య కేసులో సంచలన విషయాలు.. ఇద్దరు టెన్త్ క్లాస్ విద్యార్థుల అరెస్ట్‘బాబు’ అనే ఒక్క మాటతో వీడిన ప్రిన్సిపల్ హత్య మిస్టరీకేసుల సత్వర పరిష్కారం, నేరస్తులకు శిక్షలు పడేలా చేయడంలో సీడీఓల పాత్ర కీలకం: జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్హై-పవర్డ్ కమిటీ చర్లపల్లి ప్రిజనర్స్ అగ్రికల్చరల్ కాలనీ సందర్శనప్రజావాణిలో ప్రజల ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా ఎస్పీ డి. జానకి, ఐపీఎస్నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి: పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలిప్రతి పిటిషన్‌ను నిర్ణీత సమయంలో పరిశీలించి పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ డా. శబరీష్
Uncategorized

మీరు తీసుకున్న తీర్మానం చరిత్రలో నిలిచిపోతుంది-జిల్లా ఎస్పీ డా. శబరీష్,ఐపీఎస్.

మహబూబాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నెల్లికుదురు మండలం రామన్నగూడెం గ్రామంలో “మన గ్రామం – మన బాధ్యత” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ పాల్గొని గ్రామస్తులతో మమేకమయ్యారు. రోడ్డు భద్రత, హెల్మెట్ వినియోగం, సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా గ్రామ భద్రత, అలాగే గంజాయి నిర్మూలనపై గ్రామస్తులకు సమగ్ర అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా నేరాలను నియంత్రించవచ్చని సూచించారు. గంజాయి వంటి మత్తు పదార్థాల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. “మీ పిల్లలు ఎవరైనా గంజాయి సేవిస్తున్నారనే అనుమానం వచ్చిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించండి. వారికి రిహాబిలిటేషన్ ద్వారా ఆ అలవాటును మాన్పించేందుకు మేము ప్రయత్నిస్తాము” అని తెలిపారు. గ్రామసభ ద్వారా గ్రామస్థులు తీసుకున్న ముఖ్య నిర్ణయాలను ఎస్పీ కొనియాడారు. గ్రామంలో 100% హెల్మెట్ వినియోగం అమలు చేయడం, గ్రామాన్ని గంజాయి రహిత గ్రామంగా మార్చడం, అలాగే గ్రామాన్ని సీసీటీవీ పర్యవేక్షణలో ఉంచడం వంటి నిర్ణయాలు చారిత్రాత్మకమని పేర్కొన్నారు. “ఈ తీర్మానం గ్రామ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది” అని అన్నారు. గ్రామస్తులు తీసుకున్న నిర్ణయాలను అభినందించిన ఎస్పీ “మీరు తీసుకున్న తీర్మానం చరిత్రలో నిలిచిపోతుంది. రామన్నగూడెం గ్రామం ఆదర్శ గ్రామంగా నిలుస్తుంది” అని అన్నారు. అనంతరం గ్రామస్తులకు హెల్మెట్లను పంపిణీ చేసి, రోడ్డు భద్రత పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీస్ అధికారులు, గ్రామ సర్పంచ్, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ‘మన రన్–2026’ రెండో ఎడిషన్