బ్రేకింగ్ న్యూస్
డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం.. గూడూరులో 1,000 మందికి పైగా విద్యార్థులతో 2K రన్హైదరాబాద్‌లో 38 కిలోల ఎండు గంజాయి స్వాధీనం.. ఐదుగురు అరెస్ట్నకిలీ నంబర్ ప్లేట్లపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఉక్కుపాదంనాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ హత్య కేసులో సంచలన విషయాలు.. ఇద్దరు టెన్త్ క్లాస్ విద్యార్థుల అరెస్ట్‘బాబు’ అనే ఒక్క మాటతో వీడిన ప్రిన్సిపల్ హత్య మిస్టరీకేసుల సత్వర పరిష్కారం, నేరస్తులకు శిక్షలు పడేలా చేయడంలో సీడీఓల పాత్ర కీలకం: జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్హై-పవర్డ్ కమిటీ చర్లపల్లి ప్రిజనర్స్ అగ్రికల్చరల్ కాలనీ సందర్శనప్రజావాణిలో ప్రజల ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా ఎస్పీ డి. జానకి, ఐపీఎస్నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి: పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలిప్రతి పిటిషన్‌ను నిర్ణీత సమయంలో పరిశీలించి పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ డా. శబరీష్డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం.. గూడూరులో 1,000 మందికి పైగా విద్యార్థులతో 2K రన్హైదరాబాద్‌లో 38 కిలోల ఎండు గంజాయి స్వాధీనం.. ఐదుగురు అరెస్ట్నకిలీ నంబర్ ప్లేట్లపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఉక్కుపాదంనాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ హత్య కేసులో సంచలన విషయాలు.. ఇద్దరు టెన్త్ క్లాస్ విద్యార్థుల అరెస్ట్‘బాబు’ అనే ఒక్క మాటతో వీడిన ప్రిన్సిపల్ హత్య మిస్టరీకేసుల సత్వర పరిష్కారం, నేరస్తులకు శిక్షలు పడేలా చేయడంలో సీడీఓల పాత్ర కీలకం: జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్హై-పవర్డ్ కమిటీ చర్లపల్లి ప్రిజనర్స్ అగ్రికల్చరల్ కాలనీ సందర్శనప్రజావాణిలో ప్రజల ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా ఎస్పీ డి. జానకి, ఐపీఎస్నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి: పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలిప్రతి పిటిషన్‌ను నిర్ణీత సమయంలో పరిశీలించి పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ డా. శబరీష్
Telangana

అపరిచిత మానసిక వికలాంగ మహిళను కుటుంబానికి చేర్చిన గోషామహల్ పోలీసులు

అపరిచిత మానసిక వికలాంగ మహిళను కుటుంబానికి చేర్చిన గోషామహల్ పోలీసులు

గోషామహల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డుపై దిక్కుతోచని స్థితిలో ఉన్న ఒక మానసిక వికలాంగ మహిళను పోలీసులు సురక్షితంగా రక్షించి, అనంతరం ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించి మానవత్వాన్ని చాటుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మే 20 సాయంత్రం సుమారు 5:50 గంటల సమయంలో జోషివాడి ప్రాంతంలో ఒక మహిళ బట్టలు లేకుండా తిరుగుతున్నట్లు గోషామహల్ ఎస్ఐ లక్ష్మయ్యకు సమాచారం అందింది. సమాచారం అందుకున్న వెంటనే మహిళా పోలీస్ కానిస్టేబుళ్లు విమల, దివ్య, హోంగార్డ్ రేవణ స్వామి ఘటనా స్థలానికి చేరుకున్నారు.

అక్కడ సదరు మహిళ స్థానిక కాలనీవాసుల ఇంటి వద్ద దుస్తులు లేకుండా కూర్చొని ఉండటాన్ని గమనించిన మహిళా సిబ్బంది, కాలనీవాసుల సహాయంతో ఒక చీరను సేకరించి ఆమెకు గౌరవప్రదంగా కప్పించారు. అనంతరం విచారించగా, మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో ఆమె తన పేరు, చిరునామా వివరాలు చెప్పలేకపోయింది.

స్థానికంగా ఆరా తీసినా ఎలాంటి సమాచారం లభించకపోవడంతో, మహిళ భద్రత దృష్ట్యా ఆమెను మెడలో ఉన్న బంగారు గొలుసుతో సహా గోషామహల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం గుర్తింపు కోసం ఆమె ఫోటోను వివిధ పోలీస్ సమాచార గ్రూపుల్లో పంపించారు.

డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం.. గూడూరులో 1,000 మందికి పైగా విద్యార్థులతో 2K రన్

ఈ క్రమంలో హోంగార్డ్ రేవణ స్వామి ఉస్మానియా ఆసుపత్రికి వెళ్లి తప్పిపోయిన రోగుల వివరాలు సేకరించగా, అక్కడి నుంచి ఒక మహిళ కనిపించకుండా పోయినట్లు తెలిసింది. ఆ వివరాలు ఈమెతో సరిపోవడంతో, వెంటనే ఆమె కుమారుడిని గోషామహల్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు.

తగిన ధృవీకరణ ప్రక్రియ పూర్తి చేసిన అనంతరం, సదరు మహిళను ఆమె బంగారు గొలుసుతో సహా సురక్షితంగా కుమారుడికి అప్పగించారు. సకాలంలో స్పందించి మహిళకు రక్షణ కల్పించి కుటుంబంతో కలిపిన గోషామహల్ పోలీస్ సిబ్బందిని స్థానిక ప్రజలు, ఉన్నతాధికారులు అభినందించారు.

ఈ వివరాలను గోషామహల్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ బి. శ్రవణ్ కుమార్ వెల్లడించారు.