మహబూబాబాద్ పట్టణంలోని నెహ్రూ సెంటర్ మరియు మదర్ థెరిస్సా సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన నూతన ట్రాఫిక్ సిగ్నల్ పాయింట్లను జిల్లా ఎస్పీ డా. శబరీష్ ప్రారంభించారు. పట్టణంలో పెరుగుతున్న వాహన రద్దీ, రోడ్డు ప్రమాదాల నివారణ మరియు ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా ఈ సిగ్నల్ వ్యవస్థను అమలు చేసినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలు తప్పనిసరిగా ట్రాఫిక్ సిగ్నల్స్ను పాటించాలని సూచించారు. రెడ్ సిగ్నల్ వద్ద వాహనాలను ఆపడం, హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ వినియోగించడం, ట్రాఫిక్ నియమాలను పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.
ట్రాఫిక్ నియమాలను పాటించడం ద్వారా ప్రమాదాలను తగ్గించడంతో పాటు సురక్షితమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా ప్రజలను కోరారు.
ఈ కార్యక్రమంలో డీఎస్పీ తిరుపతి రావు, టౌన్ సీఐ రఘుపతి రెడ్డి, ట్రాఫిక్ ఎస్ఐ అరుణ్ కుమార్, ట్రాఫిక్ పోలీసులు మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
